Home » Gadde Rama Mohan
Andhrapradesh: ‘‘నా సమర్ధత గురించి ఎంపీ కేశినేని నాని మాట్లాడటం హాస్యాస్పదం’’ అని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో మెజారిటీ పెంచుకున్న తాను సమర్థుడినో, ఓట్ల శాతం తగ్గిన కేశినేని నాని సమర్థుడో ఆయనే సమాధానం చెప్పాలన్నారు.
తానా ద్వారా తెలుగురాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని 'తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి' వెల్లడించారు. ఎస్.వి.ఎస్ కళ్యాణమండపంలో పుట్టగుంట వీరభద్రరావు జయంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు 'తానా ఫౌండేషన్ ట్రస్టీ పుట్టగుంట సురేష్' 100 మంది మహిళలకు 100 కుట్టు మిషన్లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేతుల మీదుగా అందజేశారు.
వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని.. గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పడానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సిగ్గు లేదా అని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రశ్నించారు.
కరెంట్ అందరికీ నిత్య అవసరంగా మారిపోయిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. తెలుగుదేశం తీసుకువచ్చిన సంస్కరణల కారణంగానే రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ మెరుగు పడిందన్నారు. తెలుగుదేశం నాలుగు ఏళ్ళ హయాంలో ఎప్పుడు విద్యుత్ చార్జీలు పెంచలేదన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఐదేళ్ల కాలంలో ఒక్కసారి మాత్రమే పెంచారన్నారు. వైసీపీ ప్రభుత్వం నాలుగు ఏళ్ళ కాలంలో ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని గద్దె రామ్మోహన్ అన్నారు.
జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, నేడు చేసే పనులకు పొంతనే లేదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.
వైసీపీ అధిష్టానంపై (YSRCP High Command) కొందరు ఎమ్మెల్యేలు (MLAs) అసమ్మతి గళం వినిపిస్తుంటే.. మరికొందరు ముఖ్యనేతలను పార్టీ లైన్ దాటారని హైకమాండ్ సస్పెండ్ చేస్తోంది. అసమ్మతి ఎమ్మెల్యేలు రెబల్స్గా...
విజయవాడ: కృష్ణలంకకు చెందిన వైసీపీ నాయకుడు (YCP Leader) గోగుల రమేష్ (Gogula Ramesh) టీడీపీ (TDP)లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
చిన్న సమస్యపై మహిళ ప్రశ్నిస్తే దాడులకు దిగుతారా? అని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రశ్నించారు. సీఎం జగన్ ఈ ఆరాచకాల్ని ప్రోత్సహిస్తున్నారని, ప్రజలు బాధ పడుతుంటే.. ముఖ్యమంత్రికి మహా ఇష్టమని అన్నారు.
ప్రశ్నించిన మహిళపై దేవినేని అవినాష్ (Devineni Avinash)అనుచరులే దాడి చేశారని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ (Tdp mla Gadde Rammohan) ఆరోపించారు. కృష్ణలంక
ప్రజల దగ్గరకు వెళ్ళేహక్కు ప్రతీ పార్టీకి ఉందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.