Home » Gachibowli
గచ్చిబౌలిలో రూ.40 కోట్ల విలువైన భూమిపై ఉన్న సంధ్య కన్వెన్షన్ అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. గాజులరామారంలో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమణల నుంచి హైడ్రా స్వాధీనం చేసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రామకృష్ణారావు.. కంచ గచ్చిబౌలి భూముల అంశంపై తొలి సమీక్ష నిర్వహించారు. ఆ భూముల అంశానికి అనుబంధంగా ఉన్న అన్ని శాఖల ముఖ్య అధికారులతో సచివాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు.
హెచ్సీయూ భూముల వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని తెలిసినా.. కేటీఆర్ ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రధానిపై విమర్శలు చేశారని బీజేపీ ఎంపీ రఘునందన్రావు మండిపడ్డారు.
ఇష్టమొచ్చినట్టు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తామంటే ఊరుకునేది లేదు. ఆ వందెకరాలనూ ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి. లేదంటే జైలుకెళ్లేందుకు సీఎస్ సహా అధికారులు సిద్ధంగా ఉండాలి. అక్కడే కొలను దగ్గర ఆరు నెలల్లో తాత్కాలికంగా జైలు నిర్మించి అందరినీ అందులో ఉంచుతాం.
కంచ గచ్చిబౌలిలో ఉన్నది అటవీ భూమి కాదని, అది ప్రభుత్వ పోరంబోకు భూమి మాత్రమేనని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తెలంగాణ ప్రభుత్వం నివేదించింది. అక్కడ 400 ఎకరాల్లో పర్యావరణ అనుకూల ఐటీ పార్కు నిర్మించాలని భావించామని వివరించింది.
Hyderabad Drug Bust: నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. గచ్చిబౌలిలో పెద్దఎత్తున డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
శేరిలింగంపల్లి బయో డైవర్సిటీ విభాగ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ రూ.70 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. మొక్కల పెంపకం బిల్లుపై సంతకం కోసం కాంట్రాక్టర్ వద్ద రూ.2.20 లక్షలు డిమాండ్ చేశారు
కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానికి చెందినవేనని, ఎన్నో ఏళ్లుగా అవి రెవెన్యూ భూములుగా రికార్డుల్లో నమోదై ఉన్నాయని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.
Kancha Gachibowli: కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ భూములు ప్రభుత్వానివేనని స్పష్టం చేసింది. ఈ భూముల వ్యవహారం కోర్టులో ఉండడం వల్ల.. చెట్లు భారీగా పెరిగాయని వివరించింది.
కంచి గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని తాకట్టుపెట్టినట్లు టీపీసీసీ అధ్యక్షుడు చెబుతుంటే, తాకట్టు పెట్టలేదని మంత్రులు, ముఖ్యమంత్రి చెబుతున్నారని, అందరూ ఒక గదిలో కూర్చుని అసలు అమ్ముకున్నారో, కుదవపెట్టారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.