Home » Farmers
మామిడి కొనుగోలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మామిడి కొనుగోళ్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిరోజూ సమీక్షిస్తున్నారు. మూడు జిల్లాల కలెక్టరేట్లలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
రైతులు తిరగబడితే ప్రభుత్వాలే గల్లంతవుతాయి. అమరావతి రైతుల సుదీర్ఘ పోరాటమే ఇందుకు నిదర్శనం. వారి పోరాటమే గత వైసీపీ ప్రభుత్వాన్ని తుడిచిపెట్టేసింది. కరేడు రైతుల విషయంలో మేల్కొకపోతే కూటమి ప్రభుత్వానికీ అదే గతి పడుతుంది..
మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగినాయన్న సాకుతో కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని పడావు పెట్టారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది.
సహకార వ్యవస్థ ద్వారా రైతులకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని ఆప్కాబ్ చెర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు.
మా ప్రాణాలైనా ఇస్తాం, కానీ సెంటు భూమి కూడా వదులుకోం అంటూ రైతులు ముక్త కంఠంతో నినదించారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామ సచివాలయం-1 వద్ద శుక్రవారం గ్రామసభ జరిగింది.
పంట సాగుకు చేసిన అప్పు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం
అన్నదాత సుఖీభవ పథకం అర్హతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి శనివారం నుంచి రైతుసేవా కేంద్రాల్లో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు తెలిపారు.
గేదెలకు పెయ్యదూడలు మాత్రమే పుట్టేందుకు వీలుగా రూపొందించిన లింగ నిర్ధారిత వీర్యం రూ.150కే అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ మర్రిపూడి శ్రీనివాసరావు వెల్లడించారు.
రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలోని పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యాలయం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న పసుపు రైతులకు సేవలందించనుంది. దేశంలోని 24 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో పసుపు ఉత్పత్తి అవుతోంది. ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిసా, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో రైతులు పసుపు పండిస్తున్నారు. గతంలో స్పైసెస్ బోర్డు కింద ఈ పసుపు రైతులకు సేవలందేవి.