Home » Enforcement Directorate
షూటింగ్లో బిజీగా ఉన్నందున సోమవారం విచారణకు రాలేనని సినీ హీరో మహేశ్బాబు ఈడీ అధికారులకు లేఖ పంపారు.
Mahesh Babu Request To ED: ఈడీ అధికారులు సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో పాటు ఇండస్ట్రీస్ ఎండి నరేంద్ర సురానా ఇంట్లో సోదాలు నిర్వహించారు. భారీగా నగదు .. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సురానా పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవులకు పాల్పడినట్టు ఈడీ అధికారులు గుర్తించారు.
Fire Accident At Mumbai ED Office: ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎలా జరిగిందంటే..
నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితులకు నోటీసులు జారీ చేయాలని ఈడీ చేసిన విజ్ఞప్తిపై ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే విచారణ జరిపారు. సవరించిన చట్టంలోని నిబంధల ప్రకారం ఎలాంటి జాప్యం లేకుండానే నోటీసులు జారీ చేయాలని కోర్టును ఈడీ కోరింది.
హైదరాబాద్: టాలీవుడ్ సినీ హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్ల వ్యవహారంలో అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 27న విచారణకు హజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.
హరియాణా భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణ కోసం ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్డ్ వాద్రా రెండోరోజైన బుధవారంనాడు కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయన వెంట వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా వచ్చారు.
Jagan Big Shock: వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుస షాక్లు ఇస్తోంది ఈడీ. ఇప్పుడు ఏకంగా 800 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.
వివిధ బ్యాంకులకు రూ.13 వేల కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన కేసులో రియల్ఎస్టేట్ సంస్థ సురానా గ్రూప్, దాని అనుబంధ కంపెనీలు సాయి సూర్య డెవలపర్స్ సతీష్ ఇళ్లల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు నగదుతో పాటు పలు డాక్యుమెట్స్ స్వాధీనం చేసుకున్నారు.
గొర్రెల స్కీంకు సంబంధించిన పూర్తి వివరాలను ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. వాటి ఆధారంగా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ రావును విచారిస్తున్నారు. గొర్రెల స్కాంలో దళారులు మొయినుద్దీన్, ఈక్రముద్దీన్పై అధికారులు అరా తీస్తున్నారు.
సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఎన్ఫోర్స్నమెంట్ డైరక్టరేట్ అధికారులు రెండోసారి సోదాలు చేస్తున్నారు. సురానా ఇండస్ట్రీస్ లిమిటెడ్, M/s సురానా కార్పొరేషన్ లిమిటెడ్, M/s సురానా పవర్ లిమిటెడ్, కంపెనీల ఇద్దరు ప్రమోటర్లు, ఇతర అనుబంధ సంస్థలపై పీఎంఎల్ఏ (PMLA) కింద ఈడీ కేసు నమోదు చేసింది.