• Home » Enforcement Directorate

Enforcement Directorate

ED arrest: మనీలాండరింగ్ కేసులో మంత్రి అరెస్టు

ED arrest: మనీలాండరింగ్ కేసులో మంత్రి అరెస్టు

మనీ లాండరింగ్ కేసులో జార్ఖాండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలమ్‌ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారంనాడు అరెస్టు చేసింది. ఈ కేసులో ఆలమ్‌ను సుమారు తొమ్మిది గంటల సేపు ప్రశ్నించిన ఈడీ అధికారులు అయన నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో అరెస్టు చేసింది.

Rouse Avenue Court Orders : కవిత కస్టడీ 20 వరకు పొడిగింపు

Rouse Avenue Court Orders : కవిత కస్టడీ 20 వరకు పొడిగింపు

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యూడీషియల్‌ కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Cash haul: భారీగా నోట్ల కట్టలు..మంత్రికి ఈడీ సమన్లు

Cash haul: భారీగా నోట్ల కట్టలు..మంత్రికి ఈడీ సమన్లు

జార్ఘాండ్ మంత్రి అలంగీర్ ఆలమ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన పర్సనల్ సెక్రటరీ సంజీవ్ లాల్ సహాయకుడి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు పట్టుబడటంతో మంత్రి అలంగీర్‌కు ఈడీ నోటీసులు పంపింది. ఈనెల 14న తమ ముందు హాజరుకావాలని ఈడీ ఆయనను కోరింది.

Kejriwal: కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల...తొలి రియాక్షన్ ఇదే

Kejriwal: కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల...తొలి రియాక్షన్ ఇదే

మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి శుక్రవారం సాయంత్రం విడుదలయ్యారు. జూన్ 1వ తేదీ వరకూ ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు అధికారులు ఆయనను సాయంత్రం విడుదల చేశారు.

Delhi Liquor Case: ఢిల్లీ మద్యం మనీలాండరింగ్‌ కేసులో కీలక అప్డేట్

Delhi Liquor Case: ఢిల్లీ మద్యం మనీలాండరింగ్‌ కేసులో కీలక అప్డేట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Scam Liquor Case) మార్చి 15న కవితను అరెస్టు చేసి... మరుసటి రోజు రౌస్‌ అవెన్యూ సీబీఐ కోర్టు ముందు ఈడీ హాజరుపరిచిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు(శుక్రవారం) ఈ కేసులో ఎన్‌ఫోర్సమెంట్‌ డైరక్టరేట్‌ - ఈడీ ఏడో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మరో నలుగురు నిందితుల పాత్రపై దర్యాప్తు సంస్థ ఛార్జీషీట్‌ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

PM Narendra Modi: దోచుకున్న డబ్బుల్ని మోదీ రికవరీ చేస్తున్నారు

PM Narendra Modi: దోచుకున్న డబ్బుల్ని మోదీ రికవరీ చేస్తున్నారు

జార్ఖండ్‌లోని ఓ హౌస్ కీపర్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిర్వహించిన సోదాల్లో.. లెక్కల్లో చూపని రూ.25 కోట్ల నోట్ల కట్టలు బయటపడిన ఉదంతంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తనతో పాటు తన ప్రభుత్వం..

Supreme Court: కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సమయంపై ఈడీని నిలదీసిన సుప్రీంకోర్టు

Supreme Court: కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సమయంపై ఈడీని నిలదీసిన సుప్రీంకోర్టు

ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారంనాడు విచారణ జరిగింది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సమయంపై స్పందించాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

Delhi Liquor Case: ఈడీ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

Delhi Liquor Case: ఈడీ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. బెయిల్‌పై మే 6న తీర్పు ఇవ్వనుంది. కవిత బెయిల్ పిటిషన్‌పై బుధవారం కోర్టులో విచారణకు రాగా.. ఈడీ వాదనలు వినిపించింది. సెక్షన్ 19 కింద కవితను చట్టబద్దంగా అరెస్టు చేశామని.. అక్రమంగా అరెస్టు చేశారనే దానిలో పసలేదని ఈడీ పేర్కొంది. అలాగే కేసుకు సంబంధించి మరికొన్ని వివరాలను ఈడీ తరపున న్యాయవాది కోర్టు ముందు ఉంచారు. దాదాపు రెండు గంటల పాటు ఈడీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అనంతరం తీర్పును స్పెషల్ కోర్టు రిజర్వ్ చేసింది.

Delhi Liquor Scam: కవితను అక్రమంగా అరెస్ట్ అనే దానిలో పసలేదు.. ఈడీ వాదనలు

Delhi Liquor Scam: కవితను అక్రమంగా అరెస్ట్ అనే దానిలో పసలేదు.. ఈడీ వాదనలు

Telangana: ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మొదలైంది. బుధవారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ మొదలవగా.. ఈడీ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఈడీ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ కవిత పిటిషన్ దాఖలు చేయగా.. గత రెండు రోజులుగా కోర్టులో విచారణ జరుగుతోంది. నిన్నటి (మంగళవారం) విచారణలో కవిత తరపున న్యాయవాది నితేష్ రానా... ఈడీ తరపున లాయర్ జోయబ్ హుస్సేన్ వినిపించారు.

Delhi Liquor Scam:  ఈడీ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

Delhi Liquor Scam: ఈడీ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

Telangana: ఢిల్లీ లిక్కర్ ఈడి కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. మంగళవారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుగగా.. కవిత తరపున న్యాయవాది నితేష్ రానా వాదనలు వినిపించగా... ఈడీ తరపున లాయర్ జోయబ్ హుస్సేన్ వినిపించారు. ఈడీ వాదనల అనంతరం ఈ కేసుపై విచారణను కోర్టు రేపటికి (బుధవారం) వాయిదా వేసింది. రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి. రేపు మధ్యాహ్నం ఇరువురి వాదనలు రౌస్ అవెన్యూ కోర్టు విననుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి