Home » Encounter
నేడు ఉదయం పోలీసులు, నేరస్థుల ముఠాకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ పోలీసుకు బుల్లెట్ గాయాలు కాగా, నలుగురు నేరస్థులు మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లాలో చోటుచేసుకుంది.
జమ్మూ కాశ్మీర్, సోపోర్లోని, జలూర గుజ్జార్పట్టి ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ కార్తీక్ మృతి చెందారు. దీంతో ఆయన స్వగ్రామం బంగారువాండ్లపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ సరిహద్దు మారేడు బాక అడవుల్లో మావోయిస్టులకు.. భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దీంతో మావోయిస్టలు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు తెలంగాణ ఛత్తీస్ గడ్ సరిహద్దు నివురు గప్పిన నిప్పులా మారింది. భారీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఇరువైపుల నుంచి కాల్పులు నిలిచిపోగానే ఘటనా ప్రాంతం వద్ద యూనిఫాంతో ఉన్న ముగ్గురు నక్సల్ మృతదేహాలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్ధాలను కూడా ఘటనా స్థలి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
ఛత్తీస్గఢ్: నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్ట్ లకు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా.. డీఆర్జీ సైనికుడు మృతి చెందినట్టు సమాచారం. అభూజ్మడ్ అడవుల్లో 12 గంటలుగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
Encounter: కొత్త ఏడాది.. తొలి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ - ఒడిశా సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు.
Telangana: చెల్పాక ఎన్కౌంటర్ ప్రాంతాన్ని పౌరహక్కుల సంఘం నేతలు పరిశీంచారు. చెల్పాక ఎన్కౌంటర్ అంతా బూటకమే అని, అన్నంలో విషం పెట్టి చంపారని పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపించారు.
జమ్మూ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.
నారాయణపూర్ జిల్లా అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయి మృతిచెందారు.