Home » Elephant
పంటలపై ఏనుగుల దాడిని నివారించడానికి, వాటిని అడవుల్లోకి మళ్లించడానికి ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశామని జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్ తెలిపారు.
పలమనేరు -గుడియాత్తం రహదారిలో ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది.
తిరుపతి జిల్లా: చంద్రగిరి మండలం, నారావారిపల్లెలో విషాదం చోటు చేసుకుంది. పంటపొలాల్లోకి ఏనుగుల రావడంతో వాటిని తిరిమేందుకు గ్రామస్తులతోపాటు ఉప సర్పంచ్ మార్పూరి రాకేష్ కూడా వెళ్లాడు. ఏనుగుల గుంపు పారిపోగా.. ఓ గున్న ఏనుగు ఉండిపోయింది. దాని అరుపులతో మళ్లీ ఏనుగుల గుంపు వెనక్కి వచ్చాయి. ఈ క్రమంలో గ్రామస్తులు పారిపోగా.. రాకేష్ అక్కడే ఉన్నాడు. గుంపులో ఓ ఏనుగు రాకేష్ను తొండంతో పట్టుకుని నేలకేసి కొట్టింది.
విచిత్రంగా ప్రవర్తించిన ఏనుగును చూసి అంతా అవాక్కవుతున్నారు. షెడ్లో ఉన్న ఏనుగులకు ఓ వ్యక్తి స్నానం చేయిస్తుంటాడు. ఇంతలో ఓ ఏనుగుకు పైపుతో నీళ్లు కొడుతుండగా.. ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అప్పటిదాకా సైలెంట్గా ఉన్న ఏనుగు.. అతను నీళ్లు పడుతుండడం చూసి వెంటనే స్పందించింది.
Viral News: ఓ యువకుడు గున్న ఏనుగును రెచ్చగొట్టించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ ఏనుగుల గుంపు వెళ్తుండగా అందులో ఒక ఏనుగుల గుంపును ఓ యువకుడు కావాలని రెచ్చగొట్టాడు. దానికి దగ్గరగా వెళ్తూ చేతులు ఊపడం మొదలుపెట్టాడు.
ఏనుగులు చూడటానికి గంభీరంగా కనిపించినా.. కొన్నిసార్లు మనుషుల్లా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. మనుషుల్లాగే ఏనుగులకు కూడా అప్పుడప్పుడూ అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఏనుగుల విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా..
వ్యవసాయ భూములను ధ్వంసం చేస్తున్న అడవి ఏనుగులను బంధించేందుకు రెండు గుంకీ ఏనుగులు(Elephants) రంగంలో దిగాయి. దిండుగల్ జిల్లా నీలమలకోట, కినత్తుపట్టి, కొంబై(Neelamalakota, Kinathupatti, Kombai) తదితర గ్రామాల్లో రైతులు వరి సహా పలురకాల పంటలు, అరటి తదితరాలు సాగుచేస్తున్నారు.
నీలగిరి(Neelagiri) జిల్లా పందలూరు, పరిసర ప్రాంతాల్లో ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్న ‘బుల్లెట్’ అనే ఏనుగు(Elephant)ను మత్తు ఇంజక్షన్ వినియోగించి బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తు న్నారు.
నీలగిరి(Neelagiri) జిల్లా పందలూరు పరిసరాల్లో తేయాకు తోటల కార్మికులు నివసిస్తున్న ప్రాంతాల్లోని ఓ ఏనుగు(Elephant) ఇటీవల కాలంలో తరచూ ప్రవేశిస్తోంది. ప్రాణనష్టం జరుగకముందే ఏనుగును అడవుల్లోకి మళ్లించేలా అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో తొక్కి నాశనం చేయడంతో పాటు మనుషుల ప్రాణాలనూ బలిగొంటున్న గజరాజుల కట్టడికి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది.