Home » Election Commission
బిహార్లో 22 ఏళ్ల తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను ఈసీ చేపట్టడం విశేషం. ఓటర్ల తుది జాబితా ఆధారంగానే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనుంది. తుది జాబితా కాపీలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు పంపిస్తామని బీహార్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) తెలిపారు.
బిహార్లో 22 ఏళ్ల తర్వాత ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను ఎలక్షన్ కమిషన్ నిర్వహించింది. గత ఆగస్టు 1న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించింది. సెప్టెంబర్ 1వ తేదీలోగా వ్యక్తులు, రాజకీయ పార్టీలకు తమ క్లెయిమ్స్, అభ్యంతరాలు తెలియజేసుకునే అవకాశం కల్పించింది.
రెండేళ్లకే కాంగ్రెస్ మీద ప్రజలకు విరక్తి కలిగిందని బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురువేస్తామని ధీమా వ్యక్తం చేశారు రాంచందర్ రావు.
ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇవ్వడంతో తాము స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా కోర్టులను ఆశ్రయించి ఎన్నికలు ఆపాలని చూస్తే చేసేది ఏం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
రాజ్యాంగంలోని 324వ నిబంధన, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 20బి కింద తమకు లభించిన ప్లీనరీ పవర్స్తో పరిశీలకులను నియమించినట్టు ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ ఈసీ పర్యవేక్షణ, క్రమశిక్షణ కింద వీరు పనిచేస్తారని వివరించింది.
అక్టోబర్ 4,5 తేదీల్లో రెండ్రోజుల పాటు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పాట్నాలో పర్యటిస్తారు
జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ అండ్ కశ్మీర్ (లెజిస్లేచర్తో సహా), లద్దాక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగిందని, రాజ్యసభకు నాలుగు ఖాళీలు ఏర్పడిన సమయంలో ఎన్నికలు నిర్వహించేందుకు తగిన ఎలక్టరేట్లు లేరని ఈసీ తెలిపింది.
బిహార్ ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ గడువుకు ముందే ఎన్నికల ప్రక్రియ ఈసీ పూర్తి చేయాల్సి ఉంది. ఎన్నికల సన్నాహకాలు, తుది ఓటర్ల జాబితాపై సమీక్ష కోసం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వచ్చే వారంలో బిహార్లో పర్యటించనున్నారు.
ఈసీ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులతో (CEOs) న్యూఢిల్లీలో ఈసీ ఇటీవల సమావేశం నిర్వహించింది. రాబోయే 10-15 రోజుల్లో ఎస్ఐఆర్ రోల్అవుట్కు సిద్ధంగా ఉండాలని ఈసీ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో ఆదేశాలిచ్చారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తు్న్న వారికి ఎన్నికల కమిషన్ కొమ్ముకాస్తోందని రాహుల్ పదేపదే విమర్శలు గుప్పిస్తున్నారు. గత గురువారంనాడు కూడా మీడియా సమావేశంలో ఆయన కర్ణాటక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన డాటాను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ఓటర్ల ఓట్లను ఒక పద్ధతిప్రకారం తొలగించారని ఆరోపించారు