Home » Election Commission
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెల్లు చీటీ పాడనుంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఒక్క అభ్యర్థి బరిలో ఉన్నా సరే.. ఎన్నిక నిర్వహించనుంది.
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో ఓటర్ల జాబితాలో ఎన్నో అవకతవకలు జరిగాయన్నారు. ఐదు నెలల కాలంలో 39 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారన్నారు. మహారాష్ట్రలో బీజేపీ విజయానికి ఇదే కారణమన్నారు.
Election Notification: తెలంగాణలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ల్గొండ - ఖమ్మం - వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 3 నుంచి 10 వరకు నోటిఫికేషన్లను స్వీకరించనుండగా.. 11న పరిశీలించనున్నారు.
ఆప్ వలంటీర్లకు రక్షణ కల్పించాలని, కార్యకర్తలపై దాడులను నిలువరించడంలో విఫలమైన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని కేజ్రీవాల్ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)కు విజ్ఞప్తి చేశారు. దాడుల ఘటనలకు బాధ్యులైన బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయాలని కోరారు.
కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని ఈసీ పేర్కొంటూ ఇందుకు ఆధారాలు ఉన్నాయా అని ఆయనను ప్రశ్నించింది. జాతీయ భద్రతకు, ప్రజాసామరస్యానికి భంగం కలిగించే ఆకతాయి స్టేట్మెంట్లు విషయంలో మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తూ తీర్పులు వెలువడిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసింది.
రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో కృత్రిమ మేధ(ఏఐ)ను విరివిగా వినియోగిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం(ఈసీ) అప్రమత్తమైంది. ఏఐ సాయంతో రూపొందించిన ఫొటోలు, వీడియోలు, ఆడియో వంటివి ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయని గుర్తించింది.
నకిలీ ఓట్లు సృష్టించేందుకు బీజేపీ కొత్త మార్గం ఎంచుకుందని సీఈసీకి రాసిన లేఖలో కేజ్రీవాల్ ఆరోపించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నేతల తమ ఇంటి అడ్రెస్సులతో నకిలీ ఓట్లు సృష్టించుకుంటున్నారని అన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను రాజీవ్ కుమార్ ప్రకటించిన నేపథ్యంలో రిటైర్మెంట్ తర్వాత మీ ప్లాన్స్ ఏమిటని మీడియా అడిగినప్పుడు... మీ అందరికీ దూరంగా హిమాలయాల్లోని సుదూర ప్రాంతాలకు వెళ్లి నాలుగైదు నెలలు ఉంటానన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆప్, బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మధ్యలో మేమున్నామంటూ కాంగ్రెస్ సైతం ఆప్, బీజేపీని టార్గెట్ చేస్తోంది. ఢిల్లీ ఓటరు ఎవరివైపు ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది.
అప్డేట్ చేసిన జాబితా ప్రకారం దేశ రాజధానిలో 1,55,24,858 మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు. వీరిలో 84,49,645 మంది పురుష ఓటర్లు, 71,73,952 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.