Home » Election Commission
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయింది. 18వ సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోస్టల్ బ్యాలట్ ఓట్లు మినహా ఈవీఎంల్లో 65.79 శాతం మేర పోలింగ్ జరిగినట్లు గురువారం సీఈసీ రాజీవ్ కుమార్ వివరించారు.
ఇంకొన్ని గంటల్లో ఈవీఎంల్లో దాగిన అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా సంపద సర్వే, ఆస్తుల పునఃపంపిణీ చుట్టూనే వాదం, వివాదం, సవాళ్ల పర్వం సాగింది.
లోక్సభ ఎన్నికల అనంతరం 150 మంది జిల్లా మెజిస్ట్రేట్లకు కేంద్ర హోం మంత్రి అమిత్షా ఫోన్ చేసి వారిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఇటీవల చేసిన వ్యాఖ్యల వ్యవహారం ముదురుతోంది. దీనిపై ఈసీ సోమవారంనాడు జైరామ్ రమేష్కు అల్టిమేటం ఇచ్చింది.
లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే కేంద్ర హోం మంత్రి అమిత్షా దేశవ్యాప్తంగా 150 మంది జిల్లా మెజిస్ట్రేట్లకు ఫోన్ చేసి వారిని ప్రభావితం చేశారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ చేసిన వ్యాఖ్యలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఘాటుగా స్పందించారు. వదంతులు వ్యాప్తి చేయడం, ప్రతి ఒక్కరిని అనుమానించడం సరికాదని అన్నారు.
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు-2024, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు (మంగళవారం) వెల్లడి కానున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది.
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచింది. ఆ పార్టీ మూడు స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది. ఈశాన్య రాష్ట్రంలో ఎన్సీపీ గెలువడంతో రికార్డుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ విషయాన్ని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు భారత ఎన్నికల సంఘాన్ని(ఈసీఐ) కలిశాయి. మంగళవారం కౌంటింగ్లో తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరిగాకే.. ఈవీఎంలను తెరవాలని ఇండియా కూటమి కోరింది.
లోక్సభ ఎన్నికల ఫలితాలు ఈనెల 4వ తేదీన వెలువడుతుండటంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారంనాడు మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయనుంది. ఎన్నికలు పూర్తయి, కౌంటింగ్కు ఒకరోజు ముందు ఎన్నికల కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తుండటం ఇదే మొదటిసారి.
లోక్సభ ఎన్నికల కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుండటంతో ప్రధాన పార్టీలు తమ విజ్ఞాపనలతో ఎన్నికల కమిషన్ ను కలుస్తు్న్నాయి. 'ఇండియా' కూటమి ప్రతినిధిలు ఆదివారంనాడు ఈసీని కలిసి పలు విజ్ఞాపనలు చేయగా, ఆ కొద్ది సేపటికే బీజేపీ ప్రతినిధుల బృందం ఈసీని కలిసింది.
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండల వేడిమిని తట్టుకోలేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల విధుల్లో పాల్గొన్న 33మంది సిబ్బంది శనివారం ఎండల కారణంగా మృతిచెందారు. వీరిలో హోంగార్డులు, శానిటేషన్ సిబ్బంది ఉన్నారు.