Home » Election Commission
జగదీప్ ధన్ఖడ్ రాజీనామా నేపథ్యంలో.. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.
ముసాయిదా ఓటర్ల జాబితాలో ఏదైనా పొరపాట్లు ఉంటే ఓటర్లు కానీ, రాజకీయ పార్టీలు కానీ తమ అసెంబ్లీ నియోజకవర్గంలోని సంబంధిత ఈఆరోఓ (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్)ను కానీ, ఏఈఆర్ఓ (అస్టిస్టెంట్ ఈఆర్ఓ)వద్ద కానీ తమ అభ్యంతరాన్ని దాఖలు చేయవద్దని ఈసీ తెలిపింది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజ్యాంగ బాధ్యతగా ఎస్ఐఆర్ను నిర్వహిస్తున్నామని ఈసీ తెలింది. ఎస్ఐఆర్పై ఈసీ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం కోర్టు పరిశీలనలో ఉండగా, తాము చేపట్టిన ప్రక్రియ చట్టబద్ధమని, రాజ్యాంగంలోని 324వ నిబంధనకు లోబడి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఎన్నికల కమిషన్ చెబుతోంది.
బిహార్లో ఎన్నికల కమిషన్ ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఐఎస్ఆర్ కారణంగా 35.5 లక్షల మంది పేర్లను తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
బిహార్లో మాదిరిగా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత తనిఖీ చేపట్టాలని ఎన్నికల కమిషన్ ఈసీ నిర్ణయించింది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఆగస్టులో ఓటర్ల జాబితా సవరణని ప్రారంభించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది.
ఎన్నికల కమిషన్ బిహార్లో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలవడానికి కేవలం 2నెలల ముందు బిహార్ ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసమని ఎన్నికల సంఘం(ఈసీ) చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)’పై వివాదం ముదురుతోంది.
లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన ఒక దేశం-ఒకే ఎన్నిక విధానం రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు సీజేఐలు పేర్కొన్నారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ బిహార్లో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సమీక్ష స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ రాజ్యాంగ వ్యతిరేకమని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ ఏడీఆర్ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానివల్ల లక్షలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతారని తెలిపింది.