Home » Election Commission of India
హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీ చేసిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీజేపీ చేస్తున్న ఓటు చోరీపై ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. యూపీ వంటి ఇతర రాష్ట్రాల వారికి కూడా హర్యానాలో ఓట్లు ఉన్నాయని ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పలు కీలక సూచనలు చేశారు.
కాంగ్రెస్పై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బీఆర్కే భవన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పలు అంశాలని ప్రస్తావించారు కేటీఆర్.
గత ఆరేళ్లుగా పలు పార్టీలు ఎన్నికల్లో పాల్గొనడం లేనందున వాటిని జాబితా నుంచి తొలగిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. మొదటి విడతగా ఆగస్టు 9న 334 రిజిస్టర్ అయిన గుర్తింపులేని రాజకీయ పార్టీలను జాబితా నుంచి ఈసీ తొలగించింది.
ఈవీఎం బ్యాలెట్ పేపర్లు మరింత సులువుగా చదివేందుకు వీలుగా ఉండేలా నిబంధనలను ఈసీఐ సవరించింది. తొలిసారి ఈవీఎంలపై గుర్తులతోపాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు కూడా ఉండబోతున్నాయి.
రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ బిహార్ ఎస్ఐఆర్ ప్రక్రియలో చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటింటాల్సి ఉంటుందని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. బీహార్ ఎస్ఐఆర్ ప్రక్రియలో 12వ గుర్తింపు పత్రంగా ఆధార్ను చేర్చాలంటూ సెప్టెంబర్ 8న ఎన్నికల కమిషన్కు ఇచ్చిన ఉత్తర్వులను సవరించేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఓట్ల చోరీపై త్వరలో మరో పెద్ద బాంబు పేలుస్తామని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాంబును ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఆ బాంబుతో ప్రధాని మోదీ ఇక దేశానికి తన ముఖాన్ని చూపించలేరని విమర్శించారు.
నిన్న ఇద్దరు పాక్ మహిళలు.. ఇప్పుడు అఫ్ఘానిస్థాన్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ పౌరులు బిహార్ ఓటరు జాబితాలో కనిపించారు. వెంటనే అప్రమత్తమైన ఎన్నికల..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇండియా కూటమి తరపున బీహార్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికలు న్యాయంగా జరిగితే, రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోతుందని జోస్యం చెప్పారు.
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్పై రాజకీయ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ ఇవాళ(సోమవారం) సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో కొత్తగా 79 పోలింగ్ స్టేషన్ల ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. గతంలో 329 ఉన్న పోలింగ్ స్టేషన్లను 408కి పెంచనున్నామని ఆర్వీ కర్ణన్ వివరించారు.