Home » Election Commission of India
తెలంగాణ మంత్రివర్గ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. సమావేశంలో చర్చించే అంశాలపై మాత్రం షరతులు విధించింది. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జూన్ 1వ తేదీన ఏడో విడత లోక్ సభ ఎన్నిక ముగియనుంది. 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో అత్యవసర విషయాలు మాత్రమే చర్చించాలని ఈసీ కండీషన్ పెట్టింది.
ఏపీలో వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో దాడులు పెరిగిపోయాయి. ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) జరిగిన పోలింగ్ రోజు, మరుసటి రోజు నుంచి కూడా వైసీపీ మూకలు అల్లర్లకు పాల్పడుతున్నాయి. మరోసారి అధికారంలోకి ఎలాగైనా రావాలని పెద్ద ఎత్తున కుట్రలకు పాల్పడుతోంది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసిన తర్వాత పలు జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలపై ఎన్నికల కమిషన్ (Election Commission) సీరియస్ అయింది. ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగిన గొడవలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలు రణరంగంగా మారిన పరిస్థితి. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ కన్నెర్రజేసి ఆయా జిల్లాల ఎస్పీలు, పలువురు పోలీసు ఉన్నతాధికారులపై వేటు వేసింది.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసిన తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. దీంతో ఎన్నికల కమిషన్ (Election Commission) వెంటనే చర్యలు చేపట్టి మూడు జిల్లాల్లో ఉన్న ఎస్పీలను బదిలీ చేసింది.
సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్లో దేశవ్యాప్తంగా 69.16 శాతం పోలింగ్ నమోదైంది. గత మూడు దశలలో జరిగిన ఎన్నికల కంటే నాలుగోదశలోనే అత్యధికంగా పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రంలో పోలింగ్ తర్వాత జరిగిన ఘటనలపై ఎన్నికల కమిషన్ (Election Commission) ఆదేశాలు వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ (Kanakamedala Ravindra Kumar) కోరారు.
పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీకి(Mamata Banerjee) వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను తమ్లూక్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయ్కి(Abhijit Gangopadhyay) ఎన్నికల సంఘం(EC) శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీచేసింది.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రంలో పలు ఘర్షణలు, అల్లర్లు నెలకొన్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) చర్యలు చేపట్టింది. ఈ మేరకు పల్నాడు కలెక్టర్, పలు జిల్లాల ఎస్పీలపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు పడింది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల(Andhra Pradesh Elections) నేపథ్యంలో జగన్(YS Jagan) సర్కార్ విపరీత పోకడల కారణంగా మొత్తం పోలీసు శాఖపైనే మచ్చ పడింది. ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం పోలీసు యంత్రాంగాన్ని అడ్డగోలుగా వాడుకోవాలన్న వ్యూహం బెడిసికొట్టింది. దీని ఫలితంగా..