Home » Election Campaign
టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి, సంక్షే మం పరుగులు పెడతాయని టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి అన్నారు. ఆమె శుక్రవారం పట్టణంలోని బోయపేట, విద్యానగర్, కోట ప్రాంతంలో ఎన్నిక ల ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడోసారి బాలకృష్ణను గెలిపించాలన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే పురం ప్రశాంతంగా, అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందన్నారు. పురంలో టీడపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ పాలనలో చేసిన పని ఎక్కడైనా కనబడుతోందా అని ప్రశ్నించారు.
గతంలో టీడీపీ అధికారంలో ఉండగా జరిగిన అభి వృద్ధి మాత్రమే గ్రామాల్లో ఎక్కడ చూసినా కనిపిస్తోందని, వైసీపీ పా లనలో జరిగిన అభివృధ్ధి శూన్యమని టీడీపీ కూటమి అభ్యర్థి సవిత అన్నారు. గోరంట్ల మండలంలోని బూదిలి పంచాయతీ గ్రామాల్లో శుక్ర వారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ ప్రవేశపెట్టిన ఎ న్నికల మేనిఫెస్టో పట్ల, ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ, అడుగడగున తమకు అండగా నిలుస్తున్నారని అన్నారు. మహిళలు సైతం ఉత్సహం చూపుతూ ముందుకు సాగుతున్నారన్నారు.
ప్రజలు ఈ ఎన్నికల్లో సీఎం జగన్ రెడ్డికి (CM Jagan) వెన్నులో నుంచి భయం తెప్పించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. గిద్దలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల్లో సింపతి కోసం సీఎం జగన్ ప్రాదేయ పడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) అన్నారు. పొదిలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
పల్లెల్లో పార్లమెంట్ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. నామినేషన్ల పక్రియ ముగిసిన నేపథ్యంలో పోటీలో నిలబడిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో, గ్రామ, మండల స్థాయి నాయకులు హైదరాబాద్లో ఉండే గ్రామీణ ఓటర్లపై దృష్టి సారించారు.
ఉత్తర తెలంగాణ..! ఒకప్పుడు మావోయిస్టుల కోట! ఉద్యమాల పురిటి గడ్డ! ఈ ప్రాంతం పేరు చెప్పగానే జగిత్యాల జైత్రయాత్ర, ఇంద్రవెల్లి గుర్తుకొస్తాయి! కానీ, ఇప్పుడు అక్కడ కొత్త సిద్ధాంతం పురుడు పోసుకుంటోంది. కమ్యూనిజం స్థానంలో కాషాయ దళం చిగురు తొడుగుతోంది! క్రమక్రమంగా బీజేపీ పట్టు
కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్తో కుమ్మక్కయ్యారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు ఆయన చీకటి ఒప్పందం
సీఎం జగన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితుల 27 పథకాలను రద్దు చేసి, దళిత ద్రోహిగా నిలిచిపోయారని టీడీపీ ఎమ్మెల్యే అభ్య ర్థి ఎంఎస్ రాజు అన్నారు. పట్టణంలోని యాదవ కల్యా ణమండపం ఆవరణంలో గురువారం నిర్వహించిన దళి తుల ఆత్మీయ సమావేశంలో ఆయన నియోజకవర్గం సమన్వయకర్త గుండుమల తిప్పేస్వామితో కలిసి పా ల్గొని మాట్లాడారు. గతంలో చంద్రబాబు తెచ్చిన ఎస్సీ వర్గీకరణ ప్రత్యేక ఆర్డినెన్సతో 25వేల మంది దళితులకు ఉద్యోగాలు లభించాయన్నారు. భూమి కొనుగోలు పథ కం కింద పేద దళితులకు 12 వేల ఎకరాలు ఇచ్చార న్నారు. అయితే ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన నిధులను ఇతర పథకాలకు మళ్లించి ఆర్థికం గా లబ్ధి పొందిన వ్యక్తి జగన అన్నారు.
ఒక్క చాన్స పేరుతో అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల కాలంలో ఒక్క అభివృద్ధి కూడా చేయ కుండా ప్రజలను మోసం చేసిన వైసీ పీ దద్దమ్మ ప్రభుత్వాన్ని గద్దె దింపాల ని హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి తీవ్రంగా విమర్శించా రు. రొద్దం మండల పరిధిలోని బొక్సంపల్లి, శ్యాపురం, కంబాలపల్లి, బీదానిపల్లి, నారనాగేపల్లి, జక్కలచెరువు, కనుమర, రాచూరు, నాగిరెడ్డిపల్లి, కుర్లపల్లి, కందుకూర్లపల్లి చిన్న కోడిపల్లిల్లో బీకే గురువారం ఎమ్మెల్యే అభ్యర్థి సవితతో కలిసి రోడ్షో నిర్వహించారు. నారనాగేపల్లిలో బీకే మాట్లాడుతూ... ఐదేళ్ల వైసీపీ పాలనలో జిల్లాకు ఏఒక్క పరిశ్రమైనా తీసువచ్చి ఏ ఒక్కరికైనా ఉపాధి అవకాశాలు కల్పించవా జగన అని ప్రశ్నించారు..
నందమూరి బాలకృష్ణను మూడోసారి గెలిపించుకుని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీ ఆస్తులకు రక్షణ ఉంటుందని నందమూరి వసుంధరా దేవి అన్నారు. ఆమె గురువారం స్థానిక మేళాపురం, ముద్దిరెడ్డిపల్లి, సింగిరెడ్డిపల్లి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వసుంధరాదేవి మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదన్నారు. ఈ ఐదేళ్లలో ఇబ్బందిపడ్డ విష యం తెలిసిందే. అలాంటి ఇబ్బందులు ఉండకూడదంటే సైకిల్కు ఓటేయాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి బాలకృష్ణ ఎంతో కృషిచేశారన్నారు.