• Home » Election Campaign

Election Campaign

AP Politics: మిగిలింది 10 రోజులు.. తమవైపు తిప్పుకునేందుకు నేతల యత్నాలు..

AP Politics: మిగిలింది 10 రోజులు.. తమవైపు తిప్పుకునేందుకు నేతల యత్నాలు..

ఏపీలో పోలింగ్‌కు సమయం సమీపిస్తోంది. సరిగ్గా ప్రచారం ముగియడానికి పది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇప్పటినుంచి మరో ఎత్తు అన్నట్లు ఉండనున్నాయి రాజకీయ పార్టీల వ్యూహ.. ప్రతి వ్యూహాలు. గెలుపు కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పదిరోజుల్లో ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రధాన రాజకీయపార్టీలు శ్రమిస్తున్నాయి.

MS: రాక్షస పాలనకు చరమగీతం పాడుదాం

MS: రాక్షస పాలనకు చరమగీతం పాడుదాం

వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడుదామని, చంద్రబాబును ముఖ్యమం త్రిని చేసుకుని మంచి పాలన పొందుదామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ రాజు పిలుపునిచ్చారు. ఆయన బుధవారం టీడీపీ నియోజకవర్గం సమన్వయ కర్త గుం డుమల తిప్పేస్వామితో కలిసి పట్టణంలోని శివాపురం, మారుతీనగర్‌, చిల్లెచిక్కనబండ, నాగన్నకుంట, వడ్రపా ళ్యం తదితర కాలనీల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధి కారంలోకి వస్తే అవినీతి రహిత పాలన అందిస్తామన్నా రు.

GUMMANURU: వైసీపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించండి

GUMMANURU: వైసీపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించండి

దౌర్జన్యాలకు మారుపేరుగా నిలిచిన వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను తిరస్కరించి, ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం పిలుపునిచ్చారు. పట్టణంలోని 18, 19, 20 వార్డు ఇనచార్జిలు తలారి సరోజమ్మ, అంజలీ దేవి, పవన కుమార్‌ గౌడు ఆధ్వర్యంలో బుధవారం ఉదయం జయరాం ప్రచారం నిర్వహించారు.

SAVITA: ఫ్యానకు ఓటేస్తే ఉరేసుకోవాల్సిందే..

SAVITA: ఫ్యానకు ఓటేస్తే ఉరేసుకోవాల్సిందే..

ఒక్క చాన్సపేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన ప్రభుత్వం అవినీతి, అరాచకాలకు ఒడిగట్టిందని... మళ్లీ వైసీపీకి ఓటేస్తే జనం ఫ్యానకు ఉరివేసుకోవాల్సిందేనని టీడపీ కూటమి ఎమ్మెల్యే అ భ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె బుధవారం రొద్దం మండల పరిధిలోని సానిపల్లి, గొబ్బరంపల్లి, బొమ్మిరెడ్డి పల్లి, నల్లూరు, చోళేమర్రి, కల్లుకుంట, చిన్నమంతూరు, దందేపల్లి, పీ కొత్తపల్లి, పెద్దమంతూరు, చెరుకూరు గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ ఐదేళ్లకాలంలో వైసీపీ ప్రభుత్వం అనేకమంది టీడీపీ నాయకులు, కార్య కర్తలపై అక్రమ కేసులు బనాయించిందన్నారు.

దొంగ రిజిసే్ట్రషన్లపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఏదీ?

దొంగ రిజిసే్ట్రషన్లపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఏదీ?

భూములను నకిలీ ఆధార్‌ కార్డులతో దొంగ రిజిస్ట్రేషన్లు చేయడంలో విశ్వేశ్వరరెడ్డికి ఉన్న శ్రద్ధ, అభివృద్ధిపై లేదని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. కూడేరు మండలం జయపురం, చోళసముద్రం, కూడేరు, కమ్మూరు, అరవకూరు గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు గ్రామాల్లో ప్రజలు గజమాలలతో, మహిళలు హారతులతో బ్రహ్మరథం పట్టారు. కేశవ్‌ మాట్లాడుతూ వైసీపీ ఈ ఐదేళ్ల కాలంలో గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదన్నారు.

KALAVA CAMPAIN: రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం

KALAVA CAMPAIN: రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తామని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం మండలంలోని కెంచానపల్లి, జుంజురంపల్లి, బీఎనహళ్లి, బొమ్మక్కపల్లి, మల్లాపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు.

AMILINENI: కళ్యాణదుర్గం అభివృద్ధే లక్ష్యం: అమిలినేని

AMILINENI: కళ్యాణదుర్గం అభివృద్ధే లక్ష్యం: అమిలినేని

కళ్యాణదుర్గం అభివృద్ధే నా లక్ష్యం అని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. బ్రహ్మసముద్రం మండలం ఎరడికెర, పోలేపల్లి గ్రామాలలో కళ్యాణదుర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ంందర్భంగా సురేంద్రబాబు, పార్థసారథిలకు నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు.

AP Election 2024: అందుకే ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తు కేటాయించింది: జ్యోతుల నెహ్రూ

AP Election 2024: అందుకే ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తు కేటాయించింది: జ్యోతుల నెహ్రూ

గాజు గ్లాసు గుర్తు ఎలా వచ్చిందో తనకు తెలుసునని.. స్థానిక నేతల వత్తిడితోనే కొంతమంది అభ్యర్థులకు ఎన్నికల అధికారులు ఆ గుర్తు కేటాయించారని జగ్గంపేట ఉమ్మడి పార్టీల అభ్యర్థి జ్యోతుల నెహ్రూ (Jyothula Nehru) తెలిపారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోకు...సీఎం జగన్ (CM Jagan) మేనిఫెస్టోకు చాలా తేడా ఉందని చెప్పారు. జగన్ మేనిఫెస్టోను చూస్తే అతని మనస్సు ఏంటో అర్థం చేసుకోవచ్చని అన్నారు.

AP Elections 2024: డ్రైవింగ్‌రాని వ్యక్తి పాలనలో ఏపీ రివర్స్‌ గేర్‌లో వెళ్లింది: చంద్రబాబు

AP Elections 2024: డ్రైవింగ్‌రాని వ్యక్తి పాలనలో ఏపీ రివర్స్‌ గేర్‌లో వెళ్లింది: చంద్రబాబు

ఏపీని సీఎం జగన్ (CM Jagan) మాఫియాల రాజ్యాంగా తయారుచేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. మైనింగ్‌, లిక్కర్‌, ల్యాండ్‌, శాండ్ మాఫియాలు తెచ్చారని మండిపడ్డారు. విధ్వంసం చేయడమే జగన్‌ స్వభావమని ఆరోపించారు. చీరాలలో జరుగుతున్న ప్రజాగళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.

AP Elections: గాజు గ్లాసుపై కోర్టుకు కూటమి: వర్ల రామయ్య

AP Elections: గాజు గ్లాసుపై కోర్టుకు కూటమి: వర్ల రామయ్య

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించిన అంశం అగ్గిరాజేసింది. కోర్టు ఇచ్చిన తీర్పును ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ్య అధికారి తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇదే విషయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య స్పష్టం చేశారు. గాజు గ్లాసు గుర్తు అంశంపై కూటమి నేతలు వివరించామని పేర్కొన్నారు. అయినప్పటికీ సీఈవోకు అర్థం కాలేదని తేల్చిచెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి