Home » Election Campaign
Andhrapradesh: ఎన్నికల ప్రచారంలో అప్పుడప్పుడు కొన్ని కొన్ని విచిత్ర సంఘటనలు.. అరుదైన ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. సాధారణంగా ఈ సమయంలో అభ్యర్థుంతా ఎవరికి వారే విడివిడిగా, వడివడిగా ఎన్నికల ప్రచారం సాగిస్తుంటారు. ఈ తరుణంలో ఆయా పార్టీల అభ్యర్థులు సాధారణంగా ఒకచోట కలుసుకోరు. అనుకోని పరిస్థితుల్లో అభ్యర్థులు ఒకరికి ఒకరు ఎదురైనప్పటికీ అవి ఘర్షణలకే దారి తీస్తుంటాయి. అభ్యర్థుల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఘటనలు ఎన్నో చూశాం.
Telangana: బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఈడీ, ఐటీ రైడ్స్ చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. సోమవారం ప్రసాద్ హైట్స్ రెసిడెంట్స్ (పాత వెంకటేశ్వర థియేటర్) వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి హాజరయ్యారు.
విశాఖ: రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని విశాఖ తూర్పు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. మత్స్యకారులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
అమరావతి: అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా సంపాదించిన డబ్బు వైసీపీకి దండిగా ఉంది. ఎన్నికల్లో మంచినీళ్లలా ఖర్చుపెడుతోంది. కానీ అభ్యర్థులకు పంపించిన కరెన్సీ కట్టలు ఖర్చు చేయకుండా వారు వెనకేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
మండలంలో టీడీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. నాయకు లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆదివారం గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే బాలకృష్ణకు, ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారఽథికి మద్దతు గా ఓటుని అభ్యర్థించారు. టీడీపీ మండల కన్వీనర్ రంగారెడ్డి ఆధ్వ ర్యంలో ఆయా గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళలు ప్రచారంలో పాల్గొన్నారు. చిలమత్తూరులో నాగరాజుయాదవ్, నందీ శప్ప, అశ్వత్థప్ప, లక్ష్మీనారాయణయాదవ్, గౌరీశంకర్, ఆంజనేయు లు, శివ తదితరులు స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోలో పొందుపర్చిన విషయా లను వివరించారు.
సైకిల్ గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని నందలపాడు, ఆంజనేయస్వామిమాన్యం, పీర్లమాన్యం, గాంధీనగర్, పోరాటకాలనీ, పాతకోట, టైలర్స్కాలనీ, కాల్వగడ్డవీధి ప్రాంతాల్లో ఆదివారం జేసీ అశ్మితరెడ్డి బహిరంగసభలు నిర్వహించారు.
ఓటమి భయంతోనే వై సీపీ నాయకులు ప్రచారానికి వెళ్తున్న మహిళలు, టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కే శవ్ అన్నారు. ఉరవకొండలో ప్రచారానికి వెళ్లిన ముస్లిం మహిళలపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్వో, జేసీ కేతనగార్గ్కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఎన్నికల్లో తనను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించాలని, ఐదేళ్లూ అండగా ఉంటానని కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం కోరారు. ఆదివారం ఉదయం పాతగుంతకల్లులోని వాల్మీకి సర్కిల్ నుంచి పాదయాత్రగా బయలుదేరిన ఆయన ప్రధాన రహదారిలోని ఇళ్లు, వాణిజ్య సముదాయాలలో ప్రచారం చేశారు. అనంతరం మహబూబాబాద్లో ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరయ్యారు.
పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. ఆదివారం కంబదూరు మండల పాళ్లూరు, కొత్తమిద్దెల, గొల్లపల్లి, పాత ఐపార్స్పల్లి, కొత్త ఐపార్స్పల్లి, గూళ్యం, కత్రపర్తి, కే కొత్తూరు, డీ చెన్నేపల్లిలో సురేంద్ర బాబు రోడ్షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో అమిలినేనికి గజమాలలతో సన్మానించి స్వాగతం పలికారు.
బడుగు, బలహీనవర్గాల అభివృధ్ది చంద్రబాబుతోనే సాధ్యమని టీడీపీ కూటమి అభ్యర్థి సవిత తెలిపారు. మండలంలోని కొండాపురం, వెంకట రమణపల్లి, పులేరు పంచాయతీల్లో ఆదివారం ఆమె ఎ న్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో పోటీ పడు తూ వివిధ రకాల పండ్లతో, పూలతో తయారు చేసిన గజమాలలు వేసి, హారుతులలో స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడు తూ... టీడీపీ మేనిఫెస్టో పట్ల సంతృప్తి చెందిన ప్రజ లు చూపిస్తున్న ఆదారాభిమానంతో ఇది ఎన్నికల ప్ర చారంలా లేదని విజయోత్సవంలా ఉందన్నారు.