Home » Election Campaign
టీడీపీ హయాంలోనే కురుబలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ అన్నారు. పట్టణంలోని సత్యం కన్షెనల్ హాల్లో మంగళవారం కురుబల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి కేశవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు మునువు కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
టీడీపీలో మాత్రమే అన్ని కులాలకు సమన్యాయం లభిస్తుందని ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. మంగళవారం ఉదయం పాతగుంతకల్లులోని కనకవీటి వీధిలో పెద్ద సంఖ్యలో కురుబలు టీడీపీలోకి చేరారు. దాదాపు 70 కుటుంబాలు జయరాం సమక్షంలో పార్టీ కండువాలు ధరించి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి ఉచిత తాగునీటి కనెక్షన అందిస్తామని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం డీ.హీరేహాళ్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర ్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. సూపర్సిక్స్ పథకాల కరపత్రాలను అందించి ఓటు వేయాలని కోరారు.
కళ్యాణదుర్గం ప్రజల కలలను నెరవేర్చడమే తన మొదటి కర్తవ్యమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. మంగళవారం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 12వ వార్డుకు చెందిన 20 వైసీపీ కుటుంబాలు టీడీపీలోకి చేరారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 5 రోజుల సమయమే ఉండటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విసృత్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏపీలో రికార్డు స్థాయిలో ఎండలు ఉన్నప్పటికీ జనసేనాని ప్రచారంలో దూసుకెళ్తునే ఉన్నారు. దీనికి తోడు ఆయన పాల్గొంటున్న బహిరంగ సభల్లో జనసేన వీరాభిమానులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై మైలవరం కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. - మంగళవారం తోలుకొడు, వెదురు బీడెం, కనిమెర్ల, పోరాటనగర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంపై విరుచుకుపడ్డారు. ‘‘తన అడుగులకు మడుగులోత్తలేదని.. టిక్కెట్ ఇస్తా... ఖర్చులు మొత్తం నేనే భరిస్తా..
Andhrapradesh: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. మండుటెండల్లోనే రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు రోజుల వ్యవధే ఉండటంతో ఎండలను కూడా లెక్క చేయకుండా అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే మండే ఎండల్లో ప్రచారం నిర్వహిండచంతో పలువురు అభ్యర్థులు కాస్త అనారోగ్యానికి గురవుతున్నారు..
మంత్రి జోగి రమేశ్ తనయుడు రాజీవ్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు నమోదు చేయడం జరిగింది. పెదపులిపాకలో దళితులపై వైసీపీ నేతలు దాడి చేశారు. దళితవాడలో మంత్రి జోగి కుమారుడు రాజీవ్, వైసీపీ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. కాలనీకి చెందిన సుదర్శన్, మరికొందరు మాట్లా డుకుంటుండగా.. వైసీపీ కార్యకర్తలు తమ గురించే మాట్లాడుకుంటున్నట్టు అనుమానపడి వారిపై రాజేష్ దాడి చేశాడు.
Andhrapradesh: నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. మంగళవారం ఉదయం అపార్ట్మెంట్ వాసులతో సుజనా ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. భవిష్యత్తు కార్యాచరణ, అభివృద్ధిపై ప్రధానంగా చర్చించారు. అలాగే కొండ ప్రాంత ప్రజలతో కలిసి పోయి వారి ఇబ్బందులు స్వయంగా తెలుసుకుంటున్నారు.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు కోసం ఎన్ఆర్ఐలు తరలివస్తున్నారు. జనసేనాని, అభ్యర్థలు కోసం యూకే, కెనడా నుంచి ఎన్ఆర్ఐలు ఏపీకి విచ్చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. కెనడా నుంచి శంకర్ సిద్ధం, యూకే నుంచి వెంకటేష్ అనే ఎన్ఆర్ఐలు పెందుర్తికి వచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్...