Home » Eknath Shinde
కునాల్ వ్యాఖ్యలు చూస్తుంటే ఒకరి తరఫున సుపారి తీసుకుని వేరే వారి గురించి తప్పుగా మాట్లాడినట్టు కనిపిస్తోందని షిండే అన్నారు. తన మాట ఎలా ఉన్నా ఇదే వ్యక్తి ప్రధానమంత్రి పైన, సుప్రీంకోర్టు పైన, పాత్రికేయుడు అర్నాబ్ గోస్వామిపైన, మరి కొందరు పారిశ్రామికవేత్తలపై కూడా గతంలో కామెంట్లు చేశారని గుర్తుచేశారు.
Kunal Kamra row: స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా షో సందర్భంగా డిప్యూటీ సీఎంపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. అతడు షో జరిగిన హోటళ్లో అధికార పార్టీ నేతలు విధ్వంసం సృష్టించారు. ఈ దాడికి నేతృత్వం వహించిన అధికార పార్టీ నేత రాహుల్ కునాల్ను పోలీసులు అరెస్టు చేశారు.
నిజమైన శివసేన నేత ఎవరో 2024లో ప్రజలే నిర్ణయించారని, దోశద్రోహి ఎవరో, ఆత్మగౌరవం కలవారెవరో ప్రజలు నిర్ణయించిన విషయాన్ని కమ్రా తెలుసుకోవాలని ఫడ్నవిస్ అన్నారు. బాలాసాహెబ్ థాకరే వారసత్వాన్ని షిండే ముందుకు తీసుకువెళ్లారని గుర్తు చేశారు.
తమ గడ్డపై ఒసామాబిన్ లాడెన్ను పూడ్చిపెట్టేందుకు అమెరికా నిరాకరించిందని, అతని మృతదేహాన్ని సముద్రంలో గుర్తుతెలియని ప్రాంతంలో డిస్పోజ్ చేసిందని ఏక్నాథ్ షిండే చెప్పారు. తద్వారా లాడెన్ను ఎవరూ కీర్తించకుండా అడ్డుకట్ట వేసిందని అన్నారు.
సున్నితమైన అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో పేరున్న అబు అజ్మి తాజాగా ఔరంగజేబ్ను కనికరం లేని నేత అనడం సరికాదని, ఆయన మంచి పాలకుడని కితాబిచ్చారు.
మహారాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. 2025-2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను మార్చి 10న అసెంబ్లీలో ప్రవేశపెడతారు. గత వర్షాకాల సమావేశం మంత్రుల ప్రమాణస్వీకారం లేకుండా నాగపూర్లో జరుగగా, ఈసారి పూర్తి స్థాయి సెషన్ ముంబైలో జరుగనుంది.
Pune Bus Rape Case : పూణే బస్సు అత్యాచార ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీస్ స్టేషన్కు అత్యంత సమీపంలో ఉన్న బస్టాండ్లో మహిళపై నిర్భయంగా దారుణానికి పాల్పడి చెరకు తోటల్లో దాక్కున నిందితుడిని..
దేశంలో సనాతన ధర్మం పాటించే 110 కోట్ల మందిలో సగం మందికి పైగా (55) ఇప్పటి వరకూ త్రివేణి సంగమ స్నానాలు చేశారని యూపీ ప్రభుత్వం ప్రకటించటింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఈనెల 26న మహా శివరాత్రి వరకూ కొనసాగనుంది.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మధ్య అంతర్యుద్ధం నడుస్తోందనే ప్రచారం మాత్రం ముమ్మరంగా జరుగుతోంది. అంతా 'కూల్' అని షిండే చెబుతున్నప్పటికీ లుకలుకలు ఉన్నట్టు పలు సంఘటనలు చెబుతున్నాయి.
మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో అసంతృప్తి మొదలైందా అంటే అవుననే అంటున్నారు అక్కడి విశ్లేషకులు. సీఎం హాజరైన పలు కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిండే దూరంగా ఉండిపోవడం ఆసక్తికర పరిణామమని వ్యాఖ్యానిస్తున్నారు.