Home » Eknath Shinde
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తారని మరాఠీ రిజర్వేషన్ల ఉద్యమ నేత మనోజ్ సంచలన ఆరోపణలు చేశారు. మనోజ్ వ్యాఖ్యలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఖండించారు. తమ ప్రభుత్వ సహనాన్ని పరీక్షించొద్దని తేల్చిచెప్పారు.
మహారాష్ట్రలో మరాఠా కమ్యూనిటీకి విద్య, ఉద్యాగావకాశాల్లో రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన మహారాష్ట్ర రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ మంగళవారంనాడు ఆమోదం తెలిపింది. విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో మరాఠా కమ్యూనిటీకి 10 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లును ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సభలో ప్రవేశపెట్టారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో తాజాగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ మిత్రపక్షమైన శివసేన నాయకుడు మహేశ్ గైక్వాడ్పై కాల్పులు జరిపాడు. ఈ ఘటన కళ్యాణ్ పార్లమెంటరీ సెగ్మెంట్ పరిధిలోని ఉల్లాస్నగర్లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.
'ఇది ట్రైలర్ మాత్రమే. ముందుంది సినిమా'' అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవర ఆదివారంనాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీనిపై ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ, అసలు సినిమా ముందుందంటూ లోక్సభ ఎన్నికలకు ముందు మరిన్ని చేరికలు ఉండబోతున్నాయనే సంకేతాలిచ్చారు.
దాదాపు 18 నెలలుగా స్పీకర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న శివసేన ఉద్ధవ్ థాకరే వర్గానికి మహారాష్ట్రలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన అంటూ స్పీకర్ రాహుల్ నార్వేకర్ బుధవారంనాడు స్పష్టం చేశారు. శివసేన నుంచి సీఎం ఏక్నాథ్ షిండేను తొలగించే అధికారం శివసేనకు లేదని తేల్చిచెప్పారు.
శివసేన ఉద్ధవ్ థాకరే, శివసేన షిండే వర్గాలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ కీలకమైన తీర్పును ప్రకటించనున్న నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బుధవారంనాడు కీలక వ్యాఖ్యలు చేశారు.''మాకు మెజారిటీ ఉంది'' అని ధీమా వ్యక్తం చేశారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సిన మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ తన తీర్పు వెలువరించడానికి ముందే ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కలుసుకోవడం కలకలం రేపింది. ఈ పరిణామంపై శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం కన్నెర్ర చేసింది. సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర శివసేన రూ.11 కోట్ల విరాళం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన చెక్ను రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్కు మహారాష్ట్ర నేతలు శనివారంనాడు అందజేశారు.
ఉద్ధవ్ ఠాక్రే(Uddav Tackrey) శివసేన(Shivsena) వర్గంపై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన కామెంట్స్ పై తాజాగా ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) స్పందించారు.
ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన (యూబీటీ)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మహిళా విభాగం చీఫ్ మీనాతాయ్ కాంబ్లి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శివసేన వర్గంలో చేరారు. ఈ పరిణామం ఉద్ధవ్ వర్గాన్ని ఉలిక్కిపడేలా చేసింది.