Home » Duddilla Sridhar Babu
సమాజాభివృద్ధిలో మహిళా సాధికారత అత్యంత కీలకమైన అంశమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మహిళా సాధికారతలేకుండా స్థిరమైన భవిష్యత్తును ఊహించలేమని, ఆర్థికాభివృద్ధిలో వీరి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకు దక్కాయి.
తెలంగాణను ‘స్కిల్స్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్’గా తీర్చిదిద్దేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించి రాష్ట్రంలోని ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ను సమగ్రంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
దావోస్లో తెలంగాణ దుమ్మురేపింది! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం సరికొత్త రికార్డులు సృష్టించింది! రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో ఈసారి ఏకంగా రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంది.
స్విట్జర్లాండ్లోని దావో్సలో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం జ్యూరిక్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలుసుకున్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మరో భారీ ఐటీ పార్కు ఏర్పాటు కానుంది. రూ.450 కోట్లతో కొత్త ఐటీ పార్కును ఏర్పాటు చేసేందుకు సింగపూర్కు చెందిన క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకు వచ్చింది.
రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు.. సింగపూర్ ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఎస్టీ టెలీమీడియా సంసిద్ధత వ్యక్తం చేసింది. ఫోర్త్ సిటీ ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్పేటలో డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది.
సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, కేంద్రం కూడా సహకరించాలని కేంద్ర ఎలక్ర్టానిక్స్, ఐటీ శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ను రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు.
‘‘పెట్టుబడులంటేనే తెలంగాణ అనేలా ఉండాలి. అందుకు తగ్గట్లుగా మన ప్రణాళికలను రూపొందించాలి. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఇప్పటికే దేశంలో అందరి దృష్టిని తెలంగాణ ఆకర్షిస్తోంది.