Home » Duddilla Sridarbabu
తెలంగాణలో 33 జిల్లాల్లోని ప్రతి ఇల్లు, కార్యాలయానికి ఇంటర్నెట్ సేవలు అందించేందుకు తెలంగాణ ఫైబర్ నెట్ (టీ-ఫైబర్) ద్వారా సేవలు అందిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. ఈ సేవలు ‘‘టీ-నెక్స్ట్’’ పేరిట అందుబాటులో ఉంటాయని తెలిపారు
HCU Land Issue: కంచె గచ్చిబౌలిలో అంతర్జాతీయ సంస్థలు తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రయత్నం చేస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కొంత మంది రాజకీయ కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీలో ఇంచు భూమిని కూడా తాము ముట్టుకోమని స్పష్టం చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో ఆదివారం నాడు మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూంను జిల్లా ఎస్పీ కిరణ్ ఖారేతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.
తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలిపోయాయన్న ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి శ్రీధర్బాబు కొట్టిపారేశారు.
CM Revanth Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వివిధ కేసులతో పెండింగ్లో ఉన్న తమ ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించాలని ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ ప్రతినిధులు సీఎం రేవంత్రెడ్డిని కోరారు. ఇవాళ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు.
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ తెలిపారు.
Minister Sridhar Babu: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన లేదని మండిపడ్డారు. తెలంగాణలో రైల్వే కనెక్టివిటీని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుదని చెప్పారు. గిరిజన యూనివర్సిటీకి మద్దతు ఇవ్వలేదని మండిపడ్డారు. గోదావరి-మూసీ అనుసంధానం ప్రస్తావనే లేదని చెప్పారు.
Vidyasagar Rao: తాను రచయితను కాదు... తనకు రచనలు రావు అని మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తెలిపారు. తాను సంవత్సరం పాటు జైల్లో ఉండి రచనలు రాశానని గుర్తుచేసుకున్నారు.
Minister Sridhar Babu: గ్రామీణ ప్రతిభను వెలికి తీయడానికి తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడలను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంకల్పించారని చెప్పారు.
రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు.