Home » DSC
డీఎస్సీ పరీక్షల విభాగం అధికారుల నిర్లక్ష్యంతో ఇద్దరు క్వాలిఫైడ్ అభ్యర్థులకు నిరాశ ఎదురైంది. పరీక్షలో మెరిట్ ర్యాంకు సాధించామని.. ఇన్నాళ్లూ కలలు కన్న ఉద్యోగం తప్పకుండా వస్తుందని ఆశల పల్లకిలో ఊరేగుతున్న వారి ఆశలు అడియాసలయ్యాయి.
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియలో ‘బ్యాక్లాగ్’కు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
డీఎస్సీ ఉపాధ్యాయ ఉద్యోగాలలో ఎస్సీ వాటా 15 శాతం పక్కనపెట్టి నియామక ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ మాదిగ సంఘాల ఐక్య వేదిక విజ్ఞప్తి చేసింది.
ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం కాదని భావోద్వేగం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగం అనే అంశం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉందని, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం సాగిందని పేర్కొన్నారు.
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ నిర్వహించిన 'టీజీ డీఎస్సీ-2024' పరీక్ష ఫలితాలు (DSC Results 2024) సోమవారం (సెప్టెంబరు 30) విడుదలయ్యాయి.
జూలై 18వ తేదీ నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలను కాంగ్రెస్ సర్కార్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇవాళ(సోమవారం) విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఫలితాలను ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు.
గిరిజన అభ్యర్థులకు ఉచితంగా భోజన వసతితోపాటు డీఎస్సీ శిక్షణను ఉచితంగా అందించనున్నట్టు తిరుపతి జిల్లా గిరిజన సంక్షేమ, సాధికరిత అధికారి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
గ్రూప్-2 పరీక్షలను తెలంగాణ సర్కార్ వాయిదా వేసింది. ఆగస్టులో నిర్వహించాల్సిన పరీక్షలను డిసెంబర్కు వాయిదా వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7, 8తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలని మెుదట నిర్ణయించగా నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో పరీక్షల తేదీలను మార్చింది.
KCR ప్రభుత్వంలో పేపర్ లీకేజీలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తెలిపారు. రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగ , యువతీ యువకులకు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు రాష్ట్ర ప్రభుత్వం కొత్త షెడ్యూలు విడుదల చేసింది. అక్టోబరు 3 నుంచి 20వ తేదీ వరకు రోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి.