Home » Drugs Case
Drugs Racket: భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. పెద్దమొత్తంలో వివిధ రకాల డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను సిటీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు అధికారులు పటిష్ట నిఘా ఏర్పాటు చేసినా గంజాయి రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. గ్రామీణ ప్రాంతాల యువత మత్తుకు అలవాటు పడటంతో స్థానికంగా ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. తాజాగా హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ పట్టుబడటం సంచలనంగా మారింది.
గ్యాస్ రిపేర్ పని పేరుతో డ్రగ్స్ దందా సాగిస్తున్న అంతరాష్ట్ర నిందితులను రాచకొండ పోలీసులు(Rachakonda Police) అరెస్టు చేశారు. శుక్రవారం నేరేడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ సుధీర్బాబు(CP Sudheer Babu) దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
CP Sudhir Babu: డ్రగ్స్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాచకొండ కమిషనరేట్ సీపీ సుధీర్ బాబు హెచ్చరించారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు.డ్రగ్స్ సమాచారం తెలిస్తే తమకు వెంటనే తెలియజేయాలని అన్నారు. డ్రగ్స్పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
రసాయన కంపెనీ మాటున కల్లు కల్తీకి వినియోగించే ఆల్ర్ఫాజోలం డ్రగ్స్ను తయారు చేస్తున్న ముఠా గుట్టును సంగారెడ్డి సీసీఎస్, గుమ్మడిదల పోలీసులు రట్టు చేశారు.
గంజాయి సాగు, రవాణాను పూర్తిగా నిర్మూలించడానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా గంజాయి సాగు చేసిన మన్యంలో ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.
బెట్టింగ్ వ్యసనానికి అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్న ఓ వ్యాపారి... అర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు డ్రగ్స్ దందాలోకి దిగాడు.
హైదరాబాద్: తెలుగు నటి హేమకు డ్రగ్స్ కేసులో ఊరట లభించింది. బెంగుళూరు హైకోర్టు ఆమెకు స్టే ఇచ్చింది. గత ఏడాది మే నెలలో బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన అనంతరం నటి హేమపై నమోదైన డ్రగ్స్ కేసులో ఆమెపై తదుపరి చర్యలపై హైకోర్టు స్టే విధించింది.
ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపింది. కోదాడ మండలం, నల్లబండగూడెం వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ను పోలీసులు సీజ్ చేశారు. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.
డ్రగ్స్ రహిత తెలంగాణ సాధించాలన్న లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో అరెస్టులు చేస్తున్నామని ఎక్పైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బీవీ కమలాసన్ రెడ్డి అన్నారు.
న్యూ ఇయర్ వేడుకలే లక్ష్యంగా.. ముంబై నుంచి ఎండీఎంఏ డ్రగ్స్(MDMA drugs)ను తెచ్చి నగరంలో విక్రయించడానికి ప్రయత్నించిన స్మగ్లర్ను టీజీ న్యాబ్, హైదరాబాద్ సిటీ పోలీసులు(Hyderabad City Police) సంయుక్తంగా అరెస్టు చేశారు.