Home » Devotees
చిలుకూరు బాలాజీ ఆలయం, హిమాయత్నగర్, జూబ్లీహిల్స్లోని టీటీడీ ఆలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. చిలుకూరు బాలాజీని లక్ష మందికి పైగా దర్శించుకునే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగా పార్కింగ్, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారు.
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మండవ కిరణ్మయి గురువారం సింహాచల వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో భవాని దీక్ష విరమణలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఆదివారం కావడంతో భవానీలు పెద్ద సంఖ్యలో కాలినడకన తరలివస్తున్నారు. జై దుర్గా.. జై జై దుర్గ అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది.
‘పొరబాటైనా, ఏమరపాటైనా రూల్ రూలే...దేవుడి హుండీలో సెల్ఫోన్ దేవుడిదే..మీది కాదు’ అంటుండడంతో ఓ భక్తునికి గొప్ప చిక్కొచ్చి పడింది.
అటవీ మార్గంలో శబరిమల అయ్యప్ప దర్శనానికి కాలినడకన వెళ్లే భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించనున్నారు.
మహానంది క్షేత్రంలో శుక్రవారం రాత్రి పల్లకీ ఉత్సవాన్ని ఆలయ వేదపండితులు, అర్చకులు వైభవంగా నిర్వహించారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో శనివారం మార్గశిర శుద్ధ షష్ఠిని పురస్కరించుకుని లోకకళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్య (కుమార స్వామి)కి విశేష అభిషేకం, అర్చనలు, హోమం నిర్వహించారు.
శ్రీశైల మహాక్షేత్రంలో లోకకల్యాణార్థం శుక్రవారం స్వామి, అమ్మవార్లకు ఊయల సేవను వైభవంగా నిర్వహించారు.
కార్తీక మాసం ముగింపు సందర్భంగా పోలి పాడ్యమి నేపథ్యంలో కృష్ణమ్మ దీపాల వెలుగుల కాంతులతో కళకళలాడుతోంది. కార్తిక మాసం నెలరోజులు పుణ్య స్నానాలు చేసిన భక్తులు.. కార్తీక మాసం ముగింపు నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున భక్తులు పోలిని స్వర్గానికి పంపారు. నదీ స్నానమాచరించి ఆవు నేతిలో ముంచిన వత్తులను అరటిదొప్పలలో పెట్టి వెలిగించి, నదిలో విడిచిపెట్టారు.
కార్తీకమాసం సంద ర్భంగా మహానంది ఆలయం బుధవారం భక్తులతో కిటకిటలాడింది.