Home » Delhi Excise Policy
కేసుల విచారణకు హాజరుకావాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్(CM Kejriwal) కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్(CM Hemanth Sorean)కు ఈడీ జారీ చేసిన సమన్లను పాటించడానికి ఇరువురు నిరాకరించారు. మనీలాండరింగ్ కేసులో సోరెన్ ను విచారణకు పిలవగా.. ఆయన వెళ్లకపోవడంతో ఈడీ ఆయన సన్నిహితుల నివాసాలపై దాడులు చేస్తోంది.
లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారంనాడు మూడోసారి సమన్లు పంపింది. 2024 జనవరి 3న తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆ సమన్లలో కోరింది. ఇప్పటికే ఈడీ ఆయనకు రెండుసార్లు సమన్లు పంపినప్పటికీ ఆయన విచారణకు హాజరుకాలేదు.
దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనకు పంపిన నోటీసులపై ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమైనవని, రాజకీయంగా ప్రేరేపించినవని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు సమన్లు పంపింది. లిక్కర్ కేసులో ప్రశ్నించేందుకు ఈనెల 21వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఈ సమన్లలో కోరింది.
ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని డిసెంబర్ 11వ తేదీ వరకూ రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారంనాడు పొడిగించింది. నిందితులపై పలు డాక్యుమెంట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫైల్ చేయాల్సి ఉందని కోర్టు అభిప్రాయపడింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ జ్యుడిషియల్ కస్టడీని నవంబర్ 24 వరకూ స్థానిక కోర్టు శుక్రవారంనాడు పొడిగించింది.
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టులో చుక్కుదురైంది. మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పార్లమెంటు సభ్యుడు సంజయ్ సింగ్ జ్యుడిషియల్ కస్టడీని నవంబర్ 10వ తేదీ వరకూ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారంనాడు పొడిగించింది. లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవల ఆయనను అరెస్టు చేసింది.
ఎక్సైజ్ కుంభకోణానికి చెందిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కస్టడీని ఈనెల 13వ తేదీ వరకూ ఢిల్లీ కోర్టు మంగళవారంనాడు పొడిగించింది. 2021-22 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సంజయ్ సింగ్ను అక్టోబర్ 4న ఈడీ అరెస్టు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు.