Home » Delhi Excise Policy
ఎక్సైజ్ పాలసీ కేసులో జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అమాయకులని 'ఆప్' ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. జైలు నుంచే ఆప్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని చెప్పారు.
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో చిక్కుకుని జైలు శిక్ష అనుభవిస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆప్ ( AAP ) పార్టీకి మరో కొత్త చిక్కు వచ్చి పడింది. ఆ పార్టీ నాయకురాలు, మంత్రి అతిశీకి ఎన్నికల సంఘం నోటీసు పంపింది.
లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ ఆద్మీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు. ఆరు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన ఆయనకు ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) ను ఈడీ అరెస్టు చేసింది. దీనిని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యాన్ని విచారించిన అనంతరం జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ బరువు తగ్గిపోయారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆరోపణలను జైలు అధికారులు తోసిపుచ్చారు. కేజ్రీవాల్ బరువు యధాతథంగా 65 కిలోలు ఉందని తెలిపారు.
దిల్లీ మద్యం కుంభకోణం ( Delhi Liquor Scam ) కేసులో అరెస్టై తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇవాళ జైలు నుంచి బయటకు రానున్నారు. రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై సంజయ్ సింగ్కు రూస్ అవెన్యూ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam)కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) అనారోగ్యంతో ఉన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వర్గాలు తెలిపాయి. దీంతో మార్చి 21 అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 4.5 కిలోలు తగ్గారని అన్నారు.
దిల్లీ మద్యం కేసులో ఈడీ దూకుడు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన ఈడీ ఎన్నికల సమయంలో మరికొందరిని అరెస్టు చేయడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) నూ అరెస్టు చేసింది. కస్టడీ కోసం తీహార్ జైలుకూ తరలించింది.
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అక్కడ జపం చేసుకోవాలనుకుంటున్నారు. ఇందుకుగాను తనకు జపమాల కావాలని రౌస్
తీహార్ జైలులో చదువుకునేందుకు తనకు మూడు పుస్తకాలు కావాలని అరవింద్ కేజ్రీవాల్ కోరారు. రామాయణం, భగవద్గీతతో పాటు 'హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్' పుస్తకాన్ని అందుబాటులో ఉంచాలని రౌస్ అవెన్యూ కోర్టుకు కేజ్రీవాల్ విన్నవించారు.