Home » Damodara Rajanarasimha
పాఠశాలల ప్రారంభం రోజే పాఠ్యపుస్తకాల పంపిణీలో పలుచోట్ల గందరగోళం చోటు చేసుకుంది. విద్యాశాఖ అధికారులు పంపిణీ చేసిన తెలుగు పాఠ్యపుస్తకాల్లోని ‘ముందుమాట’లో మాజీ సీఎం కేసీఆర్, గత మంత్రులు, ఉన్నతాధికారుల పేర్లు ఉండటమే ఇందుకు కారణం..
నకిలీ మందుల తయారీదారులను ఉక్కుపాదంతో అణిచివేయడానికి తెలంగాణ సర్కారు చర్యలు తీసుకుందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఇటీవలే కొత్తగా ఉద్యోగాలు సాధించిన 17 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లకు సోమవారం మంత్రి నియామక పత్రాలను అందజేశారు.
సంగారెడ్డి జిల్లా అందోల్లో బీఎస్సీ నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం పాలనపరమైన అనుమతులు మంజూరు చేసింది.
సంగారెడ్డి జిల్లా అందోల్ పట్టణంలోని శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయ(Andole Ranganatha Swami) వార్షిక బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరిగాయి. శుక్రవారం అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
మాతాశిశు సంరక్షణకు గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన కేసీఆర్ కిట్ పేరును ఇప్పటికే రేవంత్ సర్కారు తొలగించింది. దాని స్థానంలో మదర్ అండ్ చైల్డ్ హెల్త్(ఎంసీహెచ్) కిట్ పేరుతో అమలు చేస్తోంది. అంతేకాక ఈ పథకం రూపురేఖల్ని పూర్తిగా మార్చేయబోతోంది.
రాష్ట్రంలో డయాలసిస్ కేంద్రాలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీలు, డయాలసిస్ కేంద్రాల పనితీరు, తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్లపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం కోఠిలోని టీఎ్సఎంఎ్సఐడీసీ కార్పొరేషన్లో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
అందోల్లో అట్టహసంగా జరుగుతున్న శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయ(Andole Ranganatha Swami Temple) బ్రహ్మోత్సవాలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ(Damodar Rajanarsimha) ఇవాళ(ఆదివారం)హాజరయ్యారు.
పూజలు నిర్వహించడం, రక్షణ విషయంలో ఇబ్బందిగా మారుతోందని సరిగ్గా 30 ఏళ్ల క్రితం పంచలోహ విగ్రహాలను(Panchaloha Idols) లక్ష్మీ నరసింహ దేవాలయానికి చేరవేశారు. ఇప్పుడు వాటిని తిరిగి తీసుకురావడంతో ఆ పట్టణంలో పండగ వాతావరణం ఏర్పడింది. సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అందోల్(Andole) రంగనాథ స్వామి దేవాలయం(Andole Ranganatha Swami Temple) గురించే మనం మాట్లాడుకునేది.
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ప్రభుత్వేతర సిబ్బంది(జూనియర్ డాక్టర్లు, పీజీ వైద్య విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్లు)కి వేతన కష్టాలు తీరనున్నాయి. ప్రతినెలా మొదటి వారంలోనే వారికి జీతాలు, స్టైపెండ్ చెల్లించేలా ‘గ్రీన్ చానల్’ ఏర్పాటుకు ప్రభుత్వం సమాయత్తమైంది.
రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా అందోల్ - జోగిపేట పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా(Damodar Rajanarsimha) కుమార్తె త్రిషతో కలిసి 196వ పోలింగ్ బూత్లో ఓటు వేశారు.