Home » Crude Oil
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యూహాత్మక నిల్వల నుంచి చమురు విడుదల చేయాలని ఐఈఏ భారత్ను కోరింది. అయితే దేశీయ అవసరాలకే ప్రాధాన్యం ఇస్తామని చెబుతూ భారత్ ఈ అభ్యర్థనను తిరస్కరించినట్టు సమాచారం.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మనదేశ నిత్యావసరాలపై తీవ్ర ప్రభావం చూపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్, ఎరువుల దిగుమతులకు ఆటంకం ఏర్పడడంతో, అతి త్వరలోనే వీటి నిల్వలు నిండుకుంటాయని భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది.
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుకు భారత్కు అనుమతి ఇస్తున్నట్టుగా అమెరికా ఇటీవల ప్రకటించింది. దీనిపై అమెరికా ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోందని పలువురు విశ్లేషకులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా భారతీయ అమెరికన్లు ఎందుకు నోరు మెదపట్లేదని నిలదీస్తున్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత భారత ఆర్థిక వ్యవస్థపై, సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దేశంలో చమురు నిల్వలు నిండుకున్నాయని, మరో 25 రోజులకు సరిపయే ఇంధనం మాత్రమే ఉందని వార్తలు వస్తున్నాయి.
ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ చక్కగా వ్యవహరిస్తోందంటూ అమెరికా కితాబిచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు ఇటీవల ఆమోదం తెలిపిన అమెరికా ట్రెజరీ సెక్రటరీ.. భారత్ బాధ్యతాయుతంగా నడుచుకుంటోందంటూ కితాబిచ్చారు.
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు ప్రపంచ వాణిజ్యంపై, అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించడం ఆసియా దేశాలను వణికిస్తోంది.
అంతర్జాతీయ ముడి చమురు రవాణాకు కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిని మూసేస్తున్నామని, ఏ నౌక అయినా దాటడానికి ప్రయత్నిస్తే కాల్చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, నౌకదళం ఆ పని చేస్తాయని వార్నింగ్ ఇచ్చింది.
అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. తాజాగా సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అరామ్కో రిఫైనరీ కంపెనీపై డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ ఇది స్వల్పకాలికమేనన్న కథనాలు అంతర్జాతీయ మీడియాలో వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో చమురు దిగుమతుల పరంగా భారత్కు టెన్షన్ లేనట్టేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
వారం వారం ఏ మేరకు రష్యా, యూఎస్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నారో చెప్పాలని కేంద్రం రిఫైనరీలను కోరినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం త్వరలో కుదరనుందన్న వార్తల నడుమ ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.