Home » Cricket World Cup
Rachin Ravindra: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర అదరగొడుతున్నాడు. ఈ టోర్నీలో ఆడిన 9 మ్యాచ్లో ఏకంగా 70 సగటుతో 565 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకు అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో టాప్ 3లో ఉన్నాడు. నిజానికి ఒక సంవత్సరం ముందు వరకు రచిన్ రవీంద్ర కివీస్ జట్టులోనే లేడు.
India vs New Zealand: ఈ టోర్నీలో టీమిండియా ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్లో అడుగుపెట్టింది. న్యూజిలాండ్ మాత్రం ఏకంగా 4 మ్యాచ్లో ఓడిపోయింది. కానీ నెట్ రన్ రేటు బాగుండడానికి తోడు అదృష్టం కూడా కలిసిరావడంతో సెమీస్ బెర్త్ దక్కింది. టేబుల్పై ఉన్న బల బలాల ప్రకారం చూస్తే న్యూజిలాండ్ను ఓడించడం టీమిండియాకు పెదగా కష్టం కాదు. అయినప్పటికీ అభిమానుల్లో కాస్త ఆందోళన ఉంది.
వన్డే ప్రపంచకప్ మొదటి సెమీ ఫైనల్ పోరుకు కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే సెమీస్ పోరులో ఫైనల్ బెర్త్ కోసం అతిథ్య జట్టు టీమిండియా, గత ప్రపంచకప్ రన్నరఫ్ న్యూజిలాండ్ చావోరేవో తేల్చుకోనున్నాయి. సెమీస్ పోరు కోసం ఐసీసీ, మ్యాచ్ ప్రసారకర్తలు స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+హాట్స్టార్ ప్రచారాన్ని కూడా మొదలెట్టేశాయి. అయితే ఇక్కడే వచ్చింది అసలు సమస్య.
India vs New Zealand: ఆసక్తికరంగా సాగిన వన్డే ప్రపంచకప్ లీగ్ దశ పూర్తైంది. ప్రస్తుతం అందరి చూపు ఈ నెల 15, 16న జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ల పైనే ఉంది. పాయింట్ల పట్టికలో టాప్ 4లో నిలిచిన భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్లో అడుగుపెట్టాయి. ఈ నెల 15న జరిగే మొదటి సెమీస్లో టీమిండియా, న్యూజిలాండ్.. 16న జరిగే రెండో సెమీస్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.
ICC Cricket World Cup 2023: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో భారత జట్టు అంచనాలకు మించి రాణిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అదరగొడుతున్న రోహిత్ సేన లీగ్ దశలో అజేయంగా నిలిచింది. ఆడిన 9 మ్యాచ్ల్లో విజయాలు సాధించింది. ఒక ఓటమి కూడా లేకుండా సెమీస్లో అడుగుపెట్టింది. దీంతో రౌండ్ రాబిన్ ఫార్మాట్లో లీగ్ దశలో అజేయంగా 9కి 9 మ్యాచ్లు గెలిచిన మొదటి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.
Rohit sharma Records: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో లీగ్ దశలో టీమిండియా దుమ్ములేపింది. ఆడిన 9 మ్యాచ్ల్లోనూ గెలిచి లీగ్ దశలో ఒక మ్యాచ్ కూడా ఓడిపోని ఏకైక జట్టుగా నిలిచింది. దీంతో 18 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచిన రోహిత్ సేన సెమీస్లోకి ఘనంగా అడుగుపెట్టింది. ఆదివారం నెదర్లాండ్స్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లోనూ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా 160 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
India vs Netherlands: చివరి లీగ్ పోటీలో భాగంగా నెదర్లాండ్స్తో మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా ఐర్లాండ్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ హెడ్స్ హెడ్స్ చెప్పాడు. కానీ కాయిన్ టేల్స్ పడింది. దీంతో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఈ మ్యాచ్లో టీమిండియా తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. అటు నెదర్లాండ్స్ జట్టు కూడా తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా ఆడుతోంది.
Rohit sharma Records: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగుతున్నాడు. తన అద్బుత కెప్టెన్సీతో ఆకట్టుకుంటూనే బ్యాటర్గా దుమ్ములేపుతున్నాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ పవర్ప్లేలో పరుగుల వరద పారిస్తున్నాడు. బౌలర్ ఎంత గొప్పవాడైనా సరే ఏ మాత్రం లెక్క చేయకుండా వీర బాదుడు బాదుతున్నాడు. అంతకన్నా ముఖ్యంగా వ్యక్తిగత రికార్డులను పట్టించుకోకుండా పూర్తిగా జట్టు కోసం ఆడుతున్నాడు. ఎలాంటి స్వార్థం లేని ఆటను ఆడుతూ జట్టును అన్ని విధాల ముందుండి నడిపిస్తున్నాడు.
Virat Kohli: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దుమ్ములేపుతున్నాడు. ప్రతి మ్యాచ్లో 50+ రన్స్ చేస్తూ పరుగుల వరదపారిస్తున్నాడు. 500కుపైగా పరుగులు చేసిన కింగ్ కోహ్లీ ఈ ప్రపంచకప్లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలోమూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో కోహ్లీ ఏకంగా 108 సగటుతో 543 పరుగులు చేశాడు.
Rohit Sharma: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో టీమిండియా అదరగొడుతోంది. లీగ్ దశలో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో అన్నీ గెలిచి అందరికంటే ముందుగానే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ ప్రపంచకప్లో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోని జట్టు భారత్ మాత్రమే. ఇక లీగ్ దశలో భారత జట్టు తన చివరి మ్యాచ్కు సిద్ధమైంది. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్లో భారత జట్టు నెదర్లాండ్స్తో తలపడనుంది.