Home » Cricket World Cup
U19 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా.. మంగళవారం సౌతాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 245 పరుగుల లక్ష్యాన్ని ఛేధించి విజయకేతనం ఎగురవేసింది. దీంతో.. భారత్ ఫైనల్స్కి చేరుకుంది. ఫలితంగా.. U19 వరల్డ్ కప్లో వరుసగా ఐదుసార్లు ఫైనల్స్కి చేరుకున్న జట్టుగా టీమిండియా రికార్డ్ నెలకొల్పింది.
T20 World Cup 2024: క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమైంది ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సిరీస్. తాజాగా టీ20 వరల్డ్ కప్కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. జూన్ 2 నుంచి 29వ తేదీ వరకు జరుగున్న ఈ టోర్నమెంట్కు సంబంధించి టికెట్లను జారీ చేసింది ఐసీసీ. పబ్లిక్ టిక్కెట్ బ్యాలెట్ విధానంలో విక్రయిస్తున్నారు.
Sunil Gavaskar: టీ20 ప్రపంచకప్నకు మరో 6 నెలల సమయం కూడా లేదు. దీంతో జట్లన్నీ ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. ప్రపంచకప్నకు తమ జట్లను సిద్దం చేసుకోవడంపై సెలెక్టర్లు కూడా దృష్టి సారించారు. ఈ క్రమంలో ప్రపంచకప్నకు టీమిండియా ఎలాంటి జట్టుతో వెళ్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్నకు మరో 5 నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ సారి పొట్టి ప్రపంచకప్నకు వెస్టిండీస్, అమెరికా అతిథ్యం ఇవ్వనున్నాయి. జూన్లో జరిగే ఈ ప్రపంచకప్ షెడ్యూల్ గురించిన వార్తలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.
2023 సంవత్సరం ముగింపునకు రోజులు మాత్రమే మిగిలాయి. చూస్తుండగానే 12 నెలలు గడిచిపోయాయి. ఇక 2024 సంవత్సరానికి స్వాగతం పలకడమే మిగిలి ఉంది. క్రికెట్ పరంగా ఈ ఏడాది అనేక అరుదైన ఘటనలు చోటుచేసుకున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది టైమ్డ్ ఔట్ వివాదం.
కచ్చితంగా ప్రపంచకప్ గెలుస్తుందని ఆశించిన టీమిండియా ఫైనల్లో ఓడిపోవడాన్ని పలువురు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమి బాధను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
Mitchell, Marsh: భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ గెలిచిన అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్ ప్రపంచకప్ ట్రోఫిపై కాళ్లు పెట్టి మద్యపానం సేవిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Narendra Modi Stadium: ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియాకు ఎదురైన ఘోర పరాజయం కోట్లాది మంది అభిమానులను తీవ్రంగా భాదిస్తోంది. సెమీస్ వరకు అద్భుతంగా ఆడిన టీమిండియా ఫైనల్లో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇక మళ్లీ ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉండదేమో అనే బాధ అభిమానుల కలచివేస్తోంది.
World Cup Final: సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ను గెలిచి 12 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీలు లేని లోటును తీర్చుకోవాలనే టీమిండియా ఆశ నెరవేరలేదు. ఫైనల్లో జట్టుకు అనూహ్య ఓటమి ఎదురైంది. సెమీ ఫైనల్ వరకు అన్ని విభాగాల్లో అద్భుతంగా ఆడిన టీమిండియా తుది పోరులో మాత్రం తలవంచింది. అప్పటివరకు భీకరంగా ఆడిన మన వాళ్లు చివరి అడుగులో చేతులెత్తేశారు.
తిరుపతి జిల్లా: క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగిన పోరు ఉత్కంఠను రేపింది. దీన్ని తట్టుకోలేక ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు.