Home » CPM
కాంగ్రెస్ పార్టీతో పొత్తు గురించి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో శుక్రవారం నాడు సీపీఐ నేత రామకృష్ణ, సీపీఎం నేత శ్రీనివాస రావు సమావేశమై చర్చిస్తారు. వైసీపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యుహం గురించి డిస్కష్ చేసే అవకాశం ఉంది. మేనిఫెస్టోలో ఏయే అంశాలు పొందుపరచాలి..? జనాలను ఎలా ఆకట్టుకోవాలనే అంశంపై వారి మధ్య చర్చ జరిగేందుకు ఆస్కారం ఉంది.
Andhrapradesh: ఏపీకి రాజధానిగా హైదరాబాద్న కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో పెనుదుమారాన్ని రేపుతున్నాయి.
ఉద్యోగుల, కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయాలని సీపీఎం సీనియర్ నేత బీవీ రాఘవులు(BV Raghavulu) అన్నారు.
కేంద్రంలోని మోదీ సర్కార్, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వాలు కలిసి రవాణా శాఖను నిర్వీర్యం చేస్తున్నాయని సీపీఎం నేత బాబూరావు(CPM Baburao) విమర్శించారు. సీపీఎం(CPM) కార్యకర్తలతో కలిసి ఆయన లెనిన్ సెంటర్లో శనివారం ధర్నా నిర్వహించారు.
ఏపీలో విద్యుత్ రంగం అస్తవ్యస్తం అయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్.బాబురావు(Babu Rao) అన్నారు. మంగళవారం నాడు విజయవాడలోని విద్యుత్ కార్యాలయం వద్ద సీపీఎం ఆందోళన, ప్రజా బ్యాలెట్ల ద్వారా నిరసన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు తమ సమస్యల కోసం ఆందోళనకు దిగారు. అంగన్ వాడీలకు సీపీఎం నేత బాబురావు మద్దతు ప్రకటించారు. అంగన్ వాడీలతో కలిసి ఆందోళన చేపట్టేందుకు రాగా విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సీపీఎం సీనియర్ నాయకుడు తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadra) ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్బులెటెన్లో పేర్కొన్నారు.
ప్రకాశం: బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలతో మాకు పొత్తు ఉండదని, దేశ వ్యాప్తంగా మత విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు.
జాతీయ స్థాయిలో బీజేపీ ( BJP ) వ్యతిరేక పార్టీలతో జతకడతామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ( Bv Raghavulu ) తెలిపారు. బుధవారం నాడు ఏలూరులో రాఘవులు మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం మీడియా గొంతు నొక్కటానికి కొత్త చట్టం తీసుకొచ్చిందని రాఘవులు మండిపడ్డారు.
ఈనెల 8న ఏపీలో జరుగుతున్న సమ్మెలపై సీపీఎం ( CPM ) రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నది. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశానికి పలు రాజకీయ పార్టీల ప్రతినిధులను సీపీఎం నేతలు ఆహ్వానించారు. ఉదయం 11 గంటలకు రౌండ్ టేబుల్ ప్రారంభం కానున్నది.