Home » CPI
లోక్సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని సీపీఐ ప్రతినిధి బృంధం బుధవారం కలిసింది. కూటమి తరఫున 8 లోక్సభ స్థానాలు, ఉప ఎన్నికలో ఒక ఎమ్మెల్యే స్థానం గెలవడం పట్ల రేవంత్కు బృందం అభినందనలు తెలిపింది.
పాలస్తీనా (Palestine) రఫా నగరం (Rafah city)పై ఇజ్రాయెల్ దాడులకు (Israeli attacks) నిరసనగా విజయవాడలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ, ప్రజా సంఘాల నాయకులు సదస్సు నిర్వహించారు. ఇజ్రాయెల్ మారణకాండపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు (CPM state secretary Srinivasa Rao) మండిపడ్డారు.
పదేళ్లు పూర్తయినా రాష్ట్ర విభజన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం విజయవాడలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న
ఏ ఒక్కరి వల్లనో కాకుండా సమష్టి కృషితోనే రాష్ట్రం సిద్దించిందనే విషయాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాన్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ఏర్పాటులో తమ వంతు పాత్ర పోషించిన వారందరికీ ఉత్సవాల్లో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు.
తిరుపతి: వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని, ప్రశాంతమైన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ వద్ద కాండిడేట్పై హత్యయత్నం జరగడంపై పోలీసులు సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన అని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన హామీలు నెరవేర్చటంలో నరేంద్రమోదీ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి పదవీకాంక్ష పీక్స్కు చేరిందన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీపై(PM Narendra Modi) సంచలన ఆరోపణలు చేశారు సీఐపీ నేత నారాయణ(CPI Narayana). పొలిటికల్ ప్రచారంపై ఎన్నికల కమిషన్(Election Commission of India) ఇచ్చిన స్టేట్మెంట్ ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని..
గుంటూరు జిల్లా: కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వం మారే అవకాశం ఉందని, మోదీ డబుల్ ఇంజన్ అని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు.. డబుల్ కాదు కదా సింగిల్ ఇంజన్ కూడా వచ్చే అవకాశం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కామెంట్స్ చేశారు.
దేశంలో మత విద్వేషాల ద్వారా బీజేపీ పాలన సాగిస్తుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎవరిష్టం వచ్చినట్లు మతాన్ని నమ్మవచ్చని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక చట్టాలు తీసుకు వచ్చి మైనార్టీలను టార్గెట్ చేశారని మండిపడ్డారు. రూ. 16లక్షల కోట్ల రుణాలను కార్పోరేట్ శక్తులకోసం మోదీ మాఫీ చేశారని ధ్వజమెత్తారు. జింఖానా గ్రౌండ్ లో ఇండియా కూటమి ఆధ్వర్యం శుక్రవారం భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సీతారాం ఏచూరి ప్రసంగించారు.
పదేళ్లుగా ప్రధానిగా ఉన్న మోదీ ఏపీకి ఏం చేశారో చెప్పాలని సీపీఐ (CPI) జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా (D.Raja) ప్రశ్నించారు. జింఖానా గ్రౌండ్ లో ఇండియా కూటమి ఆధ్వర్యం శుక్రవారం భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో రాజా ప్రసంగించారు. దేశంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తి అయ్యిందని తెలిపారు.