Home » Congress 6 Gurantees
పార్లమెంటు ఎన్నికల తర్వాత ఊరురా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha) అన్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమక్షంలోనే సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు.
గత బీఆర్ఎస్ (BRS) పాలనలో జరిగిన మోసాలు అన్ని బయటకు వస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం నాడు గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత కేసీఆర్ పాలనలో బడుగు బలహీన వర్గాలకు ఏమి న్యాయం చేశారో మాజీ మంత్రి కేటీఆర్ చెప్పాలని ప్రశ్నించారు.
మాజీమంత్రి కేటీఆర్ తన జీవితంలో మొదటిసారి వరి పొలాల్లోకి దిగారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అన్నారు. శుక్రవారం నాడు గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వ లీలలు ప్రజలు చూశారని అన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 17వ తేదీన తుక్కుగూడలో జరిగిన సభ కంటే.. ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన జరగనున్న సభ పెద్ద ఎత్తులో విజయవంతమవుతుందని అన్నారు.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) కి బీజేపీతోనే పోటీ ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy) అన్నారు. శుక్రవారం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...రేపు(శనివారం) నల్గొండ ఎంపీ పరిధి ముఖ్యులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కేంద్రంలో మోదీ 10 ఏళ్ల దుర్మార్గ పాలనలో పలు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేశారని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్ (Madhu Yaskhi Goud) అన్నారు. శుక్రవారం నాడు గాంధీభవన్లో టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశం జరిగింది. మధు యాష్కీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేతలతో (Congress) కీలక విషయాలపై చర్చించారు.
పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్(Congress) కేడర్కు ఏఐసీసీ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి(Deepa Dasmunshi) కీలక సూచనలు చేశారు. శుక్రవారం నాడు గాంధీభవన్లో ప్రచార కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేడర్కు దిశానిర్దేశం చేశారు. ప్రచార కార్యక్రమాలు పోలింగ్ బూత్ లెవెల్ వరకు తీసుకెళ్లాలని తెలిపారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసే సత్తా కాంగ్రెస్(Congress)కు లేదని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి(Kishan Reddy) అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ వచ్చే ఎన్నికల తర్వాత మరింత బలహీనపడే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు.
పదేళ్లు ప్రధానిగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) దేశానికి ఏం చేశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ ఎలాంటి కృషి చేయలేదని అన్నారు. బుల్లెట్ ట్రైన్ను గుజరాత్కు తీసుకెళ్లిన మోదీ, వికారాబాద్కు ఎంఎంటీఎస్ రైలును కూడా తీసుకురాలేదని మండిపడ్డారు.
ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్టు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల రాజకీయ ఎత్తుగడేనని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు. సోమవారం నాడు జహీరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి పునాదులపై నిర్మించిన బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే కుప్పకూలుతోందన్నారు.
కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చాక 180మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు(Harish Rao) అన్నారు. సోమవారం నాడు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నిన్న(ఆదివారం) తాను దేవరుప్పుల మండలం లక్ష్మి భాయి తండాకు వెళ్లానని.. అక్కడ ఉన్న రైతుల కళ్లలో కన్నీళ్లను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు.