Home » Congress 6 Gurantees
లోక్సభ ఎలక్షన్ల తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ (KTR) జైలుకు పోవడం ఖాయమని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. శనివారం నాడు కామారెడ్డిలో కాంగ్రెస్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు.
అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలు అయ్యిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (KCR) అన్నారు. శనివారం నాడు చేవెళ్లలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్, బీఆర్ఎస్ (BRS) ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సభలో సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ను ఎంతగానో అభివృద్ధి చేశామని తెలిపారు.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress)కి గట్టిగా బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) అన్నారు. గురువారం నాడు చిన్నకోడూరు మండలం పెద్ద కోడూర్లో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీష్ రావు, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్ రాంరెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లల్లో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేయడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీపై చీటింగ్ కేసు పెట్టాలని మాజీ మంత్రి హరీష్రావు(Harishrao) అన్నారు. సోమవారం నాడు నర్సాపూర్లో నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో హరీష్రావు, ఎమ్మెల్యే సునీత రెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ప్రజల్లోకి వెళ్తే మంత్రులకు నిద్ర పట్టడం లేదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు (Harish Rao) అన్నారు. శనివారం నాడు జహీరాబాద్ లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీష్రావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR) ఈరోజు కరీంనగర్ ‘పొలంబాట’ కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఆరోపణలపై కేసీఆర్కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) కౌంటర్ ఇచ్చారు.
ఉపాధ్యాయులకు , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు , కాంట్రాక్ట్ లెక్చరర్లకు 5వ తేదీ గడుస్తున్న ప్రభుత్వం ఇంకా ఎందుకు జీతాలు ఇవ్వలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) ప్రశ్నించారు. శుక్రవారం నాడు గజ్వేల్ పట్టణంలోని మదీనా మస్జిద్లో బీఆర్ఎస్ తరపున ఇఫ్తార్ విందు ఇచ్చారు.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) 40 సీట్లకంటే ఎక్కువ గెలువదని కేంద్రమంత్రి, బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి (Kishan Reddy) అన్నారు. శుక్రవారం నాడు కిషన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ బీజేపీలో చేరారు.
నాలుగైదు నెలల్లోనే కరీంనగర్ ఏడారి అయ్యిందని బీఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (KCR) అన్నారు. ‘పొలంబాట’లో భాగంగా శుక్రవారం నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. సాగునీరందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. అన్నదాతలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.