Home » CM Stalin
లోక్సభ ఎన్నికల్లో పుదుచ్చేరి సహా 40 నియోజకవర్గాల్లో విజయం సాధించిన విధంగానే 2026లో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో 200 స్థానాల్లో గెలిచేందుకు పార్టీ శ్రేణులంతా ఇప్పటి నుండే కృషి చేయాలని డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) పిలుపునిచ్చారు.
రాబోవు శాసనసభ ఎన్నికలల్లోనూ మరోమారు విజయం సాధించే దిశగా డీఎంకే(DMK)లో భారీగా మార్పులు జరుగనున్నాయి. పార్టీలోని వివిధ విభాగాలకు నూతన జవసత్వాలు కల్పించేందుకు పార్టీ అధ్యక్షుడు స్టాలిన్(President Stalin) సహా సీనియర్ నేతలు చర్యలు చేపడుతున్నారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Karunanidhi) శతజయంతి వార్షికోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం(Central Govt) ఆయన రూపంతో రూ.100 నాణెం ముద్రించింది.
ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) మనసు పెడితే ఉదయనిధి ఉప ముఖ్యమంత్రి(Deputy Chief Minister) అవుతారని డీఎంకే సీనియర్ నేత, కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్ఎస్ భారతి(RS Bharti) నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
తన కుమారుడు, డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలపై ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) ఎట్టకేలకు స్పందించారు. ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని సిఫార్సులు వస్తున్న మాట వాస్తవమేనని, కానీ అవేవీ ఫలించలేదని సరదాగా వ్యాఖ్యానించారు.
వర్షాభావ పరిస్థితులకు తోడు జలాశయాల్లో నీటి మట్టం అడుగంటుతుండటంతో కావేరీ జలాల్ని(Cauvery Water) తమిళనాడుకి విడుదల చేసే ప్రసక్తే లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇదే అంశంపై మాట్లాడటానికి ఆయన ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
తన నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం గత మూడేళ్లుగా అమలు చేస్తున్న మూడు పథకాలను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం వల్లనే ఇంగ్లాండులో లేబర్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.
నీలగిరి జిల్లాలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సొంతమైన కొడనాడు ఎస్టేట్(Kodanadu Estate)లో జరిగిన హత్య, దోపిడీ తదితర ఘటనలకు సంబంధించిన కేసును ఇంటర్పోల్ సాయంతో విచారణ జరపాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) పేర్కొన్నారు.
శాసనసభ చివరిరోజు సమావేశాల సందర్భంగా హోంశాఖను నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) పోలీసుశాఖపై వరాల జల్లు కురిపించారు. పాత భవనాల్లోని పోలీసుస్టేషన్లకు కొత్త భవనాలు నిర్మించి ఇస్తామని, శాఖను పటిష్ఠ పరిచేందుకు కొత్త పోస్టులను రూపొందిస్తామని, వాహనాలు, పరికరాల కొనుగోలుకు భారీగా నిధులు కేటాయిస్తామని తెలిపారు.
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కులాల వారీగా జనగణన చేపట్టాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు.