Home » CM Jagan
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై ఉన్న సస్పెన్షన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తివేయనుంది. ఐదేళ్ల క్రితం జగన్ సర్కార్ ఏర్పడిన వెంటనే ఏవీబీపై కక్షగట్టిన సంగతి తెలిసిందే. దాంతో ఏబీవీ క్యాట్ను ఆశ్రయించగా సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. దానిని జగన్ సర్కార్ హైకోర్టులో సవాల్ చేసింది. క్యాట్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దాంతో ఏపీ సర్కార్ ఏబీవీపై ఉన్న సస్పెన్షన్ ఎత్తి వేయాలని నిర్ణయం తీసుకుంది.
కక్ష సాధించడంలో ముఖ్యమంత్రి జగన్కు మించినవారు ఉండరేమో? ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా, బ్యూరోక్రాట్ అయినా సరే ఆయన టార్గెట్ చేస్తే విలవిలలాడి పోవాల్సిందే.
విశాఖ, విజయనగరం జాతీయ రహదారికి, సముద్రానికి మధ్యలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. భోగాపురం మండలంలో భూములు చాలా ఖరీదైనవి. కొన్ని చోట్ల ఎకరం రెండు కోట్లకు పైమాటే. జగన్ ప్రభుత్వంలో చాలా ముఖ్యమైన పదవిలో ఉన్న ‘పెద్దసారు’ సొంత మనిషి ఎకరా 20 లక్షల చొప్పున కారు చౌకగా కొట్టేశారు. బినామీల పేరిట 218 ఎకరాల అసైన్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ భూముల మార్కెట్ ధర 436 కోట్లు ఉండగా... 43 కోట్లకే సొంతం చేసుకున్నారు. ఇదే ధరకు మరో 160 ఎకరాలు కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్లు చేసుకున్నారు.
ఎన్నికల ముందు వైనాట్ 175 నినాదాన్ని గట్టిగా వినిపించిన వైసీపీ ఫలితాల సమయం దగ్గరపడుతున్న వేళ స్వరం మార్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తామంటూ పోలింగ్ ముందువరకు కాన్ఫిడెంట్గా ఉన్న వైసీపీ నేతలను ప్రస్తుతం ఓటమి భయం వెంటాడుతుందట.
ఎన్నికల ఫలితాల్లో టీడీపీ విజయం తథ్యమని.. పార్టీ అధినేత చంద్రబాబు సీఎం కాబోతున్నారని తెలిసి, అధికారుల్లో వణుకు మొదలైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. పారిపోయేందుకు సిద్దమవుతున్నారు. టీటీడీలో ధర్మారెడ్డి పెద్ద బ్రోకర్ అని.. కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్ అని విమర్శించారు. ఎంపీ అవినాశ్ రెడ్డి వైఎస్ వివేకా హత్య కేసు నుంచి బయటపడేసేందుకు ధరారెడ్డి ఢిల్లీలో లాబీయింగ్ చేశాడన్నారు. జగన్ కుటుంబ సభ్యులే ఆ మాట చెప్పారన్నారు.
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. నిందితుడు సతీష్ కుమార్కు బెయిల్ మంజూరు అయినా విడుదలకాలేదు. బెయిల్ తీర్పుపై స్టే ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో గురువారం వరకు విజయవాడ ఎనిమిదో అదనపు జడ్జి కోర్టు స్టే ఇచ్చింది.
విశాఖపట్నం: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ తీవ్రస్థాయిలో విమర్ళలు గుప్పించారు. పవర్ ప్రాజెక్టులపేరుతో భూ సంతర్పణ చేశారని.. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోలార్ సంస్ధలకు భారీఎత్తున భూములు కట్టబెట్టారని ఆరోపించారు.
సీఎం జగన్పై రాయి దాడి కేసులో ఏ1 నిందితుడు సతీశ్కు బెయిల్ లభించింది. నిందితుడికి విజయవాడ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 13న విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్పై రాయిదాడి జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన 8వ అదనపు జిల్లా న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
పోలింగ్కు ముందు డికోడర్ ఛానల్కు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ లోని కొన్ని భాగాలను ట్విటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది. ప్రణయ్ రాయ్, దొరబ్లు అడిగిన ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పారు. ఇంటర్వూ ఆద్యంతం ఆశువుగా అబద్ధాలు చెప్పారు. జగన్ ఏం చెప్పారు? అసలు వాస్తవమేంటో చూద్దాం
ప్రభుత్వ శాఖల ఖజానాను ఖాళీ చేసి మరీ ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్’ (ఏపీఎస్ఎ్ఫసీ)లోకి డిపాజిట్ల రూపంలో జమ చేయించారు. కానీ...