Home » CM Jagan
ఏపీలో మే-13న సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) జరుగుండటంతో ఎన్నికల సంఘం (Election Commission) పలు నిబంధనలను విధించిన విషయం తెలిసిందే. అయితే.. అధికార వైసీపీ మాత్రం ఆ నియమాలను పాటించకుండా తుంగలో తొక్కుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..
ట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలు ఎందుకున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రశ్నించారు. గురువారం రాయచోటిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రజాగళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: ల్యాండ్ టైటిల్ యాక్ట్పై ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ల్యాండ్ టైటిల్ యాక్ట్పై ఎటువంటి సందేహాలు వద్దని.. జిరాక్స్ పేపర్లు ఇస్తారు అనేది అబద్ధమన్నారు. భూ హక్కు దారులకు ప్రయోజనం కలిగేలా యాక్ట్ను తీసుకువస్తున్నామని తెలిపారు. దళారి వ్యవస్థ ఉండకూడదని యాక్ట్ తెస్తున్నామని చెప్పారు.
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరికి, ఎంతమందికి దత్తపుత్రుడో చెప్పాలని, న్యాయ ప్రక్రియ అడ్డుకోవడం దురదృష్టకరమని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎంపీ కనకమేడల రవీంధ్రకుమార్ అన్నారు.
Andhrapradesh: కూటమి పార్టీల అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాధ్ (చిన్ని) తెలిపారు. ఉపాధి, ఉద్యోగాలు, అభివృద్ధి కావాలంటే చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారన్నారు. ఐదేళ్లల్లో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. గత ఐదేళ్లల్లో ఉద్యోగాలు లేక యువత భవిష్యత్తు నాశనం అయ్యిందని విమర్శించారు.
Andhrapradesh: పెన్సనర్ల విషయంలో ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మే 1 నుంచి మూడు రోజుల పాటు పెన్షన్లు పంపిణీ చేస్తామంటూ ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. నిన్న మేడే బ్యాంకులకు సెలవు కావడంతో ఈరోజు ఉదయం నుంచి బ్యాంకుల వద్దకు పెన్షనర్లు చేరుకున్నారు. పెన్షన్ల కోసం బ్యాంకుల వద్ద పెన్షన్దారులు పడిగాపులు కాస్తున్నారు.
ఓటరు తిరగబడితే ఏమవుతుంది.. ఫలితం తారుమరవుతుంది.. అందుకే ఎన్నికల సమయంలో ఓటర్లే దేవుళ్లు.. ఐదేళ్ల పాటు నాయకుల చుట్టూ ప్రజలు తిరిగితే.. ఎన్నికల ముందు మాత్రం నాయకులే ఓటర్ల ముందుకు వస్తారు. మాకు ఓటు వేయండి.. మీ సమస్యలన్నీ తీర్చేస్తామంటూ హామీలిస్తారు. కొంతమంది ప్రజలు నాయకుల మాటలు నమ్మి ఓటు వేస్తే.. మరికొంతమంది ఓటు ఎవరో ఒకరికి వేయాలి కదా అని ఓటు వేస్తుంటారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సాధారణంగా చాలామంది ప్రజల్లో నాయకులు, పార్టీలపై కోపం ఉంటుంది. అందుకే ఎన్నికల్లో ఫలితాలు ఊహించిన విధంగా ఉండవు. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కోలా ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటరు వైసీపీ ప్రభుత్వంపై తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు.
న్యూఢిల్లీ: జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో అనేక విషయాలను సీబీఐ దర్యాప్తు సంస్థ బయటపెట్టింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో కేసుకు సంబంధించి పలు కీలక అంశాలు వెల్లడించింది.
వైసీపీ నాయకుడు నగేష్పై మంగళవారం జరిగిన దాడిని ఆసరాగా చేసుకుని పోలీసులు టీడీపీ కీలక నాయకులను టార్గెట్ చేశారు. మరీ ముఖ్యంగా.. వైసీపీని వీడి.. టీడీపీలో చేరినవారిపై గురి పెట్టారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయరాం నాయుడును మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. అనంతపురం రూరల్ పంచాయతీ పరిధిలోని రామక్రిష్ణ కాలనీలో ఎంపీటీసీ భర్త, టీడీపీ నాయకుడు నగేష్పై మంగళవారం దాడి జరిగింది. ఆయన కళ్లలో కారంకొట్టి కొందరు దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ...
నవరత్నాలు పేరుతో నవ మోసాలు చేసిన ఘనుడు జగన్ రెడ్డి అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishna) ఆరోపించారు. రెడ్డిగూడెం గ్రామంలో కూటమి ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెడ్డిగూడెంలో కూటమి శ్రేణులు భారీ బైక్ ర్యాలీ తీశారు.