Home » CM Jagan
విజయవాడ: కూటమి బీజేపీ ఎంపీ అభ్యర్థి సుజనా చౌదరి జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక దుర్మార్గపు చట్టంగా అభివర్ణించారు.
అమరావతి: జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి తధ్యమని, కాంగ్రెస్ అధికారం లోకి రావడం ఖాయమని.. పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ తులసి రెడ్డి వ్యాఖ్యానించారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సభలో అపశృతి చోటు చేసుకుంది. శనివారం జిల్లాలోని పలమనేరులో సీఎం జగన్ సభ నిర్వహించారు. అయితే జగన్ సభకు హాజరైన ప్రజల్లో పలువురు అస్వస్థతకు గురయ్యారు. సభకు వచ్చిన జనానికి వైసీపీ శ్రేణులు చల్లని పానీయాలు పంపిణీ చేశారు. అయితే వీటిని తాగిన పలువురకి అనారోగ్యం పాలయ్యారు. వాంతులు అవడంతో వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఏపీ సీఎం జగన్ కన్ఫ్యూజన్లో ఉన్నారా.. ఓటమి భయం ఆయనను వెంటాడుతుందా.. ఐదేళ్ళలో రాష్ట్రానికి ఏం చేశామో చెప్పుకునే పరిస్థితుల్లో లేరా.. ఏ ప్రశ్న వేసినా సూటిగా ఎందుకు సమాధనాం చెప్పలేకపోతున్నారు.. సరైన సమాధానం చెప్పడానికి ఎందుకు సంకోషిస్తున్నారు.. ప్రశ్నలు అడిగితే టెన్షన్ ఎందుకు పడుతున్నారు.. ఇప్పడు ఏపీ ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవే..
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం దర్శి ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఒకమాట చెప్పి.. అధికారంలోకి వచ్చాక బాదుడే బాదుడుకు తెరతీశారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలకు జగన్ ఖర్చుపెట్టింది చాలా తక్కువే అని.. దీంతో ఏం చెప్పాలో తెలీక జగన్ కన్ఫ్యూజన్లో ఉన్నారని ఎద్దేవా చేశారు.
Andhrapradesh: రాష్ట్రంలో పండుటాకులపై జగన్ సర్కార్ పగబట్టింది. పెన్షన్దారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత రెండు రోజుల పెన్షన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ పెన్షన్ డబ్బులు అందక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అపసోపాలు పడి బ్యాంకులకు వస్తే బ్యాంకు అధికారులు పెట్టిన రూల్స్తో పెన్షన్దారులు నీరసించిపోతున్నారు.
అధికారం ఉన్నంత సేపు ఒకరకం.. అధికారం పోతుందంటే మరొక రకంలా తయారైంది ఏపీ సీఎం వైఎస్.జగన్ పరిస్థితి. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా వాస్తుని, ముహుర్తాలను నమ్ముతూ ఉంటారు. కానీ జగన్ గత ఐదేళ్ళలో తనకు నచ్చిందే చేసుకుంటూ వెళ్లారు. వాస్తును అసలు పట్టించుకోలేదు. అది అతని వ్యక్తిగత నిర్ణయం కావచ్చు. అయితే ఐదేళ్ల తర్వాత జగన్లో అధికారం కోల్పోతున్నామనే భయం మొదలైందట.
Andhrapradesh: అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామని బీజేపీ జాతీయ నేత ప్రధాన కార్యదర్శి దురుషాంత్ కుమార్ గౌతమ్ క్లారిటీ ఇచ్చారని.. దేశంలో బీజేపీకి మెజార్టీ వస్తే మాత్రం కచ్చితంగా రాజ్యాంగం మారుస్తారని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఉన్న టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు రాజ్యాంగం మార్పు విషయంపై వారి వైఖరిని ఓటర్లకు చెప్పాలన్నారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డిపై టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 16 నెలలు జైల్లో ఉన్న ఆర్ధికనేరస్తుడు సీఎంగా ఉన్నారన్నారు. జగన్ ఆర్థిక నేరస్తుడని ఆయన అఫిడవిట్ చెప్తుందన్నారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ జగన్ బాటలో నడుస్తున్నారని ఆరోపించారు.
Andhrapradesh: మద్యం నిషేధంపై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీపై కడప ఎంపీ అభ్యర్థి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి ప్రశ్నలు సంధించారు. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం హామీలు నెరవెరుస్తామని.. పూర్తి మద్య నిషేధం తర్వాతే 2024 ఎలక్షన్లో ఓట్లు అడుగుతానంటూ 2019 ఎన్నికల సమయంలో సీఎం జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై వైఎస్ షర్మిల మరోసారి ప్రశ్నలు సంధించారు.