Home » CID
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో మూడో విచారణ జరుగుతోంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తవ్వగా ప్రస్తుతం కస్టడీ పిటిషన్పై వాదనలు జరగుతున్నాయి.
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill development case) ప్రస్తుతం రిమాండ్లో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నేడు (గురువారం) వాదనలు కొనసాగుతున్నాయి.
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విషయంలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నేడు (గురువారం) కూడా విచారణ వాయిదా పడింది. తదుపరి వాదనలను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు.
ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణను విజయవాడ ఏసీబీ కోర్ట్ రేపటికి (గురువారం) వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇరువురు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి మిగతా వాదనలను గురువారం 11.15 గంటలకు వింటానని చెప్పారు.
చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ సాగుతోంది. చంద్రబాబు తరపున ప్రమోద్ దూబే వాదనలు వినిపించారు. సీఐడీ తరపును న్యాయవాది, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు విపించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సీఐడీ విచారణ ఈనెల 10కి వాయిదా పడింది. ఈ మేరకు సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులోని నిబంధనలను హైకోర్టులో లోకేష్ సవాల్ చేశారు. లోకేష్ ఇచ్చిన లంచ్ మోషన్ పిటీషన్పై ఈరోజు(మంగళవారం) హైకోర్టులో విచారణ జరిగింది. లోకేశ్ ప్రస్తుతం హెరిటేజ్లో షేర్ హోల్డర్ లోకేష్ తరపు న్యాయవాదులు చెప్పారు.
సుప్రీంకోర్టు(Supreme Court)లో వాదనలు చూసిన తీరు చూస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు రిలీఫ్ ఖాయం అనిపిస్తుందని ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju ) వ్యాఖ్యానించారు.
టీడీపీ నేతలే టార్గెట్గా జగన్ సర్కార్ కక్షపూరిత రాజకీయాలకు తెరలేపింది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత తర్వాత ఎవర్ని జైలుకు పంపాలనేదానిపై లెక్కలేసుకుంటోంది ప్రభుత్వం..
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (TDP Chief Chandrababu) అక్రమ అరెస్టుపై.. ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు...
అక్రమ కేసులు, అరెస్టులకు నిరసనగా టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం (రేపు) ఢిల్లీ వేదికగా ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్రమ అరెస్ట్కు నిరసనగా ఈ దీక్ష చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి నిర్ణయించారు.