Home » CID
పదేళ్ల తర్వాత సీఐడీ అధికారులు తెలంగాణలో మొదటిసారి కేసు నమోదు చేశారు. నకిలీ వీసా పాస్పోర్టులు ఇప్పిస్తున్న ముఠాని సీఐడీ అధికారులు పట్టుకున్నారు.
సీఐడీ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఇంకా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర ( Dulipalla Narendra ) అన్నారు.
Andhrapradesh: అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ ఫిర్యాదు మేరకు కొలికపూడిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో ఈనెల 3న ఒకసారి సీఐడీ విచారణకు హాజరైన కొలికపూడి ఈరోజు ఓ మీడియా సంస్థ ప్రతినిధితో కలసి విచారణకు హాజరయ్యారు.
అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు, దళిత ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు ( Kolikapudi Srinivasa Rao ) హైదరాబాద్లోని నివాసానికి విజిటర్స్గా వచ్చిన ఏపీ సీఐడీ నానా భీభత్సం సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ( Kinjarapu Atchannaidu ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాసమస్యలపై స్పందిస్తున్న కొలికపూడి పట్ల జగన్రెడ్డి వేధింపులు దుర్మార్గమని అచ్చెన్నాయుడు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డా. కొలికపూడి శ్రీనివాస్రావు ( Kolikapudi Srinivas Rao ) ను కొలికిపూడి శ్రీనివాసరావు భార్య మాధవికి ఏపీ సీఐడీ అధికారులు. నోటీసులు అందజేశారు. మూడో తేదీ గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డా. కొలికపూడి శ్రీనివాస్రావు ( Kolikapudi Srinivas Rao ) ను అరెస్ట్ చేసేందుకు ఏపీ సీఐడీ ( AP CID ) ప్రత్యేక బృందం హైదరాబాద్కి చేరుకున్నది. 8 మంది సీఐడీ అధికారులు నల్లగండ్లలోని అపర్ణ సైబర్ లైఫ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే కొలికపూడి శ్రీనివాస్రావు నివాసానికి చేరుకున్నది. కొలికపూడి హైదరాబాద్లో అందుబాటులో లేరని తన సతీమణి చెప్పినా వినడం లేదు.
AP CID: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. రెడ్ బుక్ అంశంపై ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. రెడ్బుక్ పేరుతో నారా లోకేష్ బెదిరిస్తున్నారని అధికారులు CID కోర్టును ఆశ్రయించారు. దీంతో నారా లోకేష్కు నోటీసులు ఇవ్వాలని CID న్యాయమూర్తి సూచించారు.
టీడీపీ జాతీయ ప్రధాన నారా లోకేశ్పై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్కు ఎన్బీడబ్ల్యూ (NBW) జారీచేయాలని పిటిషన్లో కోరింది. ఈ కేసులో లోకేశ్పై చర్యలు తీసుకోవాలని సీఐడీ కోరింది.
Andhrapradesh: ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. స్కిల్డెవలప్మెంట్ కేసులో 17 ఏపై జడ్జిమెంట్ వచ్చిన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వింటామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. మంగళవారం స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం విచారణ జరిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది.
Jagan Govt Challanges HC Order In Supreme Court : టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుకు (Chandrababu) స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు (AP High Court) రెగ్యులర్ బెయిల్ (Regular Bail) ఇవ్వడాన్ని జగన్ సర్కార్ (Jagan Govt) వ్యతిరేకిస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో (Supreme Court) రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది.