Home » Chiranjeevi
హైదరాబాద్: కేంద్రం ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
పద్మవిభూషణ్ అవార్డు రావడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబం యొక్క అండదండలు, నీడలా నడిచే కోట్లాది మంది అభిమానుల ప్రేమ, అభిమానం వల్ల తాను ఈ స్థితిలో ఉన్నానని చెబుతున్నారు.
హైదరాబాద్: పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవిలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పద్మ అవార్డుకు ఎంపికైన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
మెగాస్టార్ చిరంజీవికి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి అభినందనలు తెలిపారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవీలను అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించింది.
బుధవారం ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా అధ్వర్యంలో గోల్కొండలో లైట్ అండ్ ఇల్యూమినేషన్ షోని నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి & సినీ నటుడు చిరంజీవి, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ ప్రారంభించారు.
Andhrapradesh: మెగాస్టార్ చిరంజీవి, ఏపీసీసీ చీఫ్ షర్మిలపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవిని మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని తెలిపారు. పార్టీతో చిరంజీవి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో చింతా మోహన్ ఈ విధంగా స్పందించారు.
అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందిందని ప్రముఖ సినీనటులు మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )తెలిపారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా చిరంజీవి వచ్చారు. ఈ వేడుకలో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని చిరంజీవి తెలిపారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) ని గురువారం రాత్రి ప్రజాభవన్లో ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) ఆయన సతీమణి సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని కాశ్మీర్ నుంచి తెప్పించిన శాలువాతో చిరంజీవి సత్కరించారు. చిరంజీవి దంపతులకు పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి భట్టి విక్రమార్క సత్కారం చేశారు.