Home » Chief Minister
బీజేపీ నుంచి తాను పెద్దమొత్తంలో డబ్బులు తీసుకున్నట్టు ఐదారు రోజుల క్రితం అతిషి ఆరోపించారని, గత 10-12 ఏళ్లుగా కాంగ్రెస్ను, తనను, తన కుటుంబాన్ని వాళ్లు టార్గెట్ చేసుకున్నారని సందీప్ దీక్షిత్ తెలిపారు.
లిక్కర్ పాలసీ కేసులో బెయిలుపై విడుదలైన అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో అతిషి ముఖ్యమంత్రిగా గత సెప్టెంబర్ 23న బాధ్యతలు చేపట్టారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తన కార్యాలయానికి అనుబంధంగా యువరక్తంతో కొత్త బృందం ఏర్పాటు చేయనున్నారు. వీరికి ‘చీఫ్ మినిస్టర్ ఫెలోస్’ అని పేరు పెట్టారు.
డిసెంబర్ 4న బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ముంబైలో జరుగనుంది. ఇదే సమయంలో డిసెంబర్ 5న కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేస్తుందని బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాంకులే ప్రకటించారు.
ఫడ్నవిస్ను సీఎంగా నిర్ణయించే విషయంలో షిండేకు ఎలాంటి కోపం లేదని కూడా సుధీర్ ముంగటివార్ అన్నారు. ఒక శాఖకు సంబంధించి సొంత డిమాండ్లు ఉంటే దాని అర్ధం కోపంగా ఉన్నట్టు కాదని, షిండేకు తగిన గౌరవం ఉంటుందని చెప్పారు.
జార్ఖండ్ రాష్ట్రానికి హేమంత్ సోరెన్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 2013లో తొలిసారి సీఎం పదవి పగ్గాలు చేపట్టారు. గత ఏడాది మనీ లాండరింగ్ ఆరోపణలు రావడం, ఈడీ అరెస్ట్ చేయడంతో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ కేసులో బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. సీఎం పదవి బాధ్యతలను స్వీకరించారు.
హేమంత్ సోరెన్ కూటమి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 81 స్థానాలకు గాను 56 స్థానాలు గెలుచుకుని రెండోసారి కూడా అధికారాన్ని సొంతం చేసుకుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే 24 స్థానాలు సొంతం చేసుకుంది.
తన కుమారుడిని ఉప ముఖ్యమంత్రిని చేసి ప్రభుత్వంలో పదవులకు తాను దూరంగా ఉండాలని ఏక్నాథ్ షిండే చేస్తున్న ప్రతిపాదనతో సొంత పార్టీ నేతలే విభేదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందువల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని వారంటున్నారు.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని కించపరిచేలా, అగౌరవపరిచేలా మాట్లాడటం తప్పేనని, అందువల్ల ఈ కేసు విచారణ ఎదుర్కోవాల్సిందేనంటూ అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి సీవీ షణ్ముగంకు సుప్రీంకోర్టు(Supreme Court) తేల్చి చెప్పింది.
అక్టోబర్ 28న 29 మంది సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్లు, అదనపు జిల్లా మెజిస్ట్రేట్లను బదిలీ చేయడం ద్వారా కుట్రకు బీజేపీ తెరతీసిందని అతిషి ఆరోపించారు. ఆ తర్వాత స్వల్వ వ్యవధిలోనే ఓటర్ల జాబితా నుంచి ఆప్ ఓటర్లను తొలగించాలని అధికారులకు ఆదేశాలిచ్చిందని, ఈ ఉత్తర్వులు నేరుగా ఎస్డీఎం కార్యాలయాల నుంచి వచ్చాయని చెప్పారు.