Home » Chief Minister
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సపోర్ట్తో ముఖ్యమంత్రి స్థాయికి నితీష్ కుమార్ ఎదిగారని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజన్కు అనుగుణంగా కేంద్రంలో నితీష్ పొత్తు సాగిస్తున్నారని సమ్రాట్ చౌదరి చెప్పారు.
జనాభా ఆధారంగా డీలిమిటేషన్ వల్ల భారతదేశ సమాఖ్య వ్యవస్థకు, తమిళనాడు, ఇతర దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి తీవ్ర ముప్పు కలుగుతుందని, ఈ చర్యను అఖిల పక్ష సమావేశం ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తోందని ఆ తీర్మానం పేర్కొంది.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మంత్రి రాజీనామా వ్యవహారాన్ని సభ మందుకు తీసుకురావాల్సి ఉండగా సీఎం అందుకు భిన్నంగా వ్యవహరించారని కాంగ్రెస్ ఆరోపించింది. రాజీనామాపై సీఎం తన నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందు సభ దృష్టికి తీసుకురావాల్సి ఉంటుందని తెలిపింది.
మహిళా సమ్మాన్ యోజనతో సహా బీజేపీ ఇచ్చిన హామీలన్నింటినీ బడ్జెట్లో చేర్చనున్నట్టు సీఎం తెలిపారు. మార్చి 5న దీనిపై చర్చించేందుకు మహిళా సంస్థలన్నింటినీ విధాన సభకు ఆహ్వానిస్తున్నామనీ, బడ్జెట్పై వారంతా తగిన సూచనలు, సలహాలు ఇవ్వవచ్చని చెప్పారు.
మారుతున్న జనాభా ఆధారిత పరిస్థితులను స్టాలిన్ ప్రస్తావిస్తూ, తగినంత సమయం తీసుకునే పిల్లల్ని కనమని గతంలో తాము సూచించే వాళ్లమనీ, ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు.
మాలిక్ షాబాజ్ హుమయూన్ రజా అనే వ్యక్తి నుంచి ఈ ఫోన్ బెదిరింపులు వచ్చినట్టు ముంబై పోలీసులు వెల్లడించారు. మహారాష్ట్ర సీఎం కార్యాలయం పేల్చాస్తామంటూ సదరు వ్యక్తి బెదిరించినట్టు చెప్పారు.
ఖాళీ ఖజానాను తమకు అప్పగించారంటూ సీఎం రేఖా గుప్తా చెప్పడంపై అతిషి మాట్లాడుతూ, పదేళ్ల తర్వాత ఆర్థికంగా బలంగా ఉన్న ప్రభుత్వాన్ని బీజేపీకి తాము అప్పగించామన్నారు. సాకుల కోసం వెతుక్కోకుండా ఇచ్చిన వాగ్దానాలను బీజేపీ నిలబెట్టుకోవాలని సూచించారు.
'మహిళా సమృద్ధి యోజన' కింద పేదకుటుంబాలకు చెందిన మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయాన్ని అందిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ వాగ్దానం చేసింది. గర్బిణీలకు రూ.21,000 ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.
వైద్య విద్యార్థులకు 'నీట్' టెస్ట్ మాదిరిగానే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీల్లో అడ్మిషన్లకు కూడా స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని, ఎన్ఈపీని అనుమతిస్తే విద్యార్థులు మధ్యలోనే తమ చదువులకు స్వస్తి చెబుతారని సీఎం స్టాలిన్ అన్నారు.
షాలిమార్ భాగ్ నివాసం వద్ద తనను అభినందించేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలందరికీ రేఖా గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ను ఆమోదించినట్టు తెలిపారు.