Home » Chennai News
ఆంధ్ర రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ప్రబలుతోందని వస్తున్న వార్తలతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ల వద్ద పర్యవేక్షణ తీవ్రతరం చేశారు.
పురపాలక మంత్రిత్వ శాఖలో లంచం తీసుకుని ఉద్యోగ నియామకాలు జరిగా యనే ఆరోపణలు, టెండర్లలో అక్రమాలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ విభాగం (ఈడీ) అందించిన ఆధారాల ప్రకారం నగరపాలక శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ తదితరులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఏసీబీకి మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
నగరంలో గుర్రాలు, గాడిదలు పెంచడానికి తప్పకుండా కార్పొరేషన్ నుంచి లైసెన్స్లు పొందాల్సి ఉంటుందని గ్రేటర్ చెన్నై మేయర్ ఆర్ ప్రియా ప్రకటించారు. రిప్పన్భవనం సమావేశ మందిరంలో మేయర్ ప్రియ అధ్యక్షతన శుక్రవారం కార్పొరేషన్ సాధారణ సమావేశం జరిగింది.
‘రీల్స్ వ్యామోహం’ రెండు ప్రాణాలను బలిగొంది. రీల్స్ చేసే ప్రయత్నంలో రైలు ఢీకొని యువకుడు మృతి చెందగా, తీవ్ర మనస్తాపంతో అతని ప్రియురాలు ఆత్మహత్యకు ఒడిగట్టింది. దీంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
ఇంటి దీపమైన తన భార్య క్యాన్సర్ కారణంగా దూరమవుతుందని ఆందోళన చెందిన ఓ వ్యక్తి... ఆమెతో పాటు తనూ తనువు చాలించాలనుకున్నాడు. అయితే తామిద్దరం లేకుంటే తమ ఇద్దరు చిన్నారుల ఆలనా పాలనా చూసేవారుండరన్న భయంతో ఆ ముగ్గురికీ విషమిచ్చి, తానూ ఉరేసుకున్నాడు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 200లకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఘనవిజయం సాధిస్తుందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి అధికంగా ఉండటంతో ప్రజలు హాప్ బాయిల్డ్ గుడ్డు తింటే అనారోగ్యానికి గురవుతారని, తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు హాఫ్ బాయిల్డ్ తినొద్దని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం హెచ్చరించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రాలైన రామనాథపురం జిల్లా రామేశ్వరం-తిరుపతి మధ్య ఇకనుండి వారంలో నాలుగు రోజులు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది.
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుకు రూ.2 వేల చొప్పున పంపిణీ చేసేలా నియోజకవర్గానికి డీఎంకే రూ.20కోట్లు కేటాయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ఆరోపించారు.
రాష్ట్రంలో మరికొద్ది రోజేల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నా నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అన్నాడీఎంకే పార్టీ బహిష్కృత నాయకురాలు శశికళ అన్నారు. ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందన్నారు.