Home » Chandra Babu
లోక్సభ ఎన్నికలు-2024 ఫలితాల్లో బీజేపీకి మ్యాజిగ్ ఫిగర్ దక్కకపోవడంతో మంగళవారం తీవ్ర నష్టాల్లో ముగిసిన దేశీయ ఈక్విటీ మార్కెట్లలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫుల్ జోష్ నింపారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీయేతో కలిసి నిబద్ధతతో పయనిస్తామని, బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామంటూ ఈ రోజు (బుధవారం) ఉదయం ఆయన చేసిన కీలక వ్యాఖ్యలతో స్టాక్ మార్కెట్ సూచీలు పరుగులు పెడుతున్నాయి.
ఎన్డీఏ సర్కారు మరోసారి కేంద్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టబోతోంది. దీంతో నరేంద్ర మోదీ(PM Modi Oath Taking Ceremony) మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హస్తినకు బయలుదేరారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి చంద్రబాబు వెళ్లనున్నారు. సాయంత్రం జరిగే ఎన్డీఏ సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు. ఎన్డీఏలో ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ సహా ఢిల్లీ పెద్దలను ఆయన ఆహ్వానించనున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్ని్కల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద సందడి వాతావరణం చోటు చేసుకుంది. నిన్న జరిగిన ఎన్నికల కౌంటింగ్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. సునామీల దూసుకెళ్లింది. వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేసి.. మిగిలిన స్థానాలన్నింటినీ కూటమి తన ఖాతాలో వేసుకుంది. చంద్రబాబు నివాసం వద్ద భద్రతను అధికారులు మరింత పెంచారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలకంగా కావడంతో నేషనల్ మీడియా సైతం చంద్రబాబుకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది.
21 రోజులపాటు వేచిచూసిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీయే కూటమి అటు కేంద్రంలో, ఇటు ఏపీలోనూ అధికారాన్ని దక్కించుకుంది. ప్రభుత్వాల ఏర్పాటు చేయడమే తరువాయి. కాగా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి నేడు (బుధవారం) ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మళ్లీ కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారనే ఓ చర్చ అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తుంది. ఆ క్రమంలో ఆయన కింగ్ మేకర్గా వ్యవహరించే అవకాశాలు సైతం ఉన్నాయని సదరు సర్కిల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు.. ఆ రాష్ట్రంలోని లోక్సభ స్థానాల్లో సైతం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభంజనం సృష్టించింది.
AP Election Results 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి గెలుపొందడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు అభినందనలు తెలిపారు రేవంత్. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్.
ఏపీలో అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాల్లో గెలవాలనేది ఒక సెంటిమెంట్. ఈ రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు గెలిచిన పార్టీ ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
అధికారం శాశ్వతం అనుకుని ప్రత్యర్థి పార్టీల నేతలపై వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా బూతుల వర్షం కురిపించిన వైసీపీ మంత్రులకు ఆయా నియోజకవర్గాల ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. వైసీపీకి చెందిన పలువురు మంత్రలు అధిష్టానం దగ్గర మెప్పు కోసం తీవ్రమైన భాషతో ప్రత్యర్థి పార్టీల నేతలను తూలనాడారు.