Home » Chamala Kiran Kumar Reddy
శాసన సభాపతిని అవమానించి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారే.. మళ్లీ ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని నిరసనలు తెలపడం హాస్యాస్పదంగా ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడొస్తారోనని తాము కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నట్టు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. ఆయన అసెంబ్లీకి వస్తే అనేక సమస్యలకు పరిష్కారమవుతాయని వ్యాఖ్యానించారు.
కేటీఆర్కు అత్యంత సన్నిహితుడైన కేదార్ మృతిపై మౌనమెందుకని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి తెలిపారు. రేపో.. మాపో మంత్రి వర్గ విస్తరణ జరగనుందన్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు.
‘మా ప్రభుత్వానికి ఇంకా నాలుగేళ్ల టైమ్ ఉంది. ఈ నాలుగేళ్లలో అన్ని స్కీములూ అమలు చేసి చూపిస్తం’ అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి వ్యాఖ్యానించారు. నాలుగేళ్లలో పథకాలు అమలు చేయకుంటే ప్రజలే తమకు బుద్ధి చెబుతారన్నారు.
అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాధనంతో దోస్తులను కాపాడుకున్న ఘనత మాజీ మంత్రి కేటీఆర్కే దక్కుతుందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి అన్నారు.
హీరో అల్లు అర్జున్తోపాటు టాలీవుడ్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోపం లేదన్నారు. అయినా అల్లు అర్జున్, సినిమా ఇండస్ట్రీతో తమకు వైరం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు.
అరెస్టుతో మైలేజ్ వస్తుందన్న భ్రమలో కేటీఆర్ ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి అన్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం పుష్ప 2 సినిమా కలెక్షన్లు భారీగా పెరిగాయట కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అయితే.. పుష్ప 3 లెవల్లో మైలేజ్ వస్తుందనుకొంటున్నారని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
బీఆర్ఎస్ పార్టీపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని మూడుసార్లు గెలిపించిన కొడంగల్ లాంటి ప్రాంతాల్లో అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకునేందుకు అధికారులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.