Home » Chaganti Koteswara Rao
పురాణపండ శ్రీనివాస్ భక్తి రసాత్మకంగా అందించిన లక్ష్మీనారసింహుని దివ్య సాన్నిధ్యం ‘ఉగ్రం ... వీరం’ అమోఘ గ్రంధంలో నృసింహావిర్భావ ఘట్టం గాథని చదివితే వొళ్ళు గగుర్పొడుస్తూ ఒక పవిత్ర అనుభూతి కలుగుతుందని....శ్రీనివాస్కి, ఆయన రచనా వైభవానికి ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ కటాక్షం పుష్కలంగా ఉందని విఖ్యాత ప్రవచనకర్త, సరస్వతీపుత్రులు చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం పురాణపండ శ్రీనివాస్ రచనాసంకలనం ‘ఉగ్రం ... వీరం’ అపురూప గ్రంధాన్ని విజయవాడ దుర్గమ్మ దేవస్థాన ప్రత్యేక వేదికపై ఆయన ఆవిష్కరించారు
‘శ్రీ పూర్ణిమ’ పుస్తకాన్ని హక్కులతో కొనడానికి విజయవాడ, రాజమహేంద్రవరంకి చెందిన ప్రచురణకర్తలు పోటీపడుతున్నారు. అయితే గ్రంధానికి వ్యాపారపు నీడ తాకనివ్వని, రాజీపడని మనస్తత్వపు పురాణపండ శ్రీనివాస్ ప్రచురణకర్తలకు నిర్మొహమాటంగా మొండిచెయ్య చూపడం కొసమెరుపు.