Home » Case
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ వ్యవహారంలో తల్లీ తనయులిద్దరూ రూ.142 కోట్లు లబ్ధి పొందారని బుధవారం నాడు ఢిల్లీ ప్రత్యేక కోర్టులో వాదనలు వినిపించింది.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ 31గా ధనుంజయ రెడ్డి, ఏ 32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ 33 గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు చేర్చారు. ఇటీవల అరెస్ట్ అయిన కసిరెడ్టి రాజశేఖర్ రెడ్డి, చాణక్య రిమాండ్ రిపోర్ట్లో కూడా ఈ ముగ్గురు పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించారు. ఈ ముగ్గురి ఆదేశాల మేరకు అప్పట్లో డబ్బులు వసూలు చేశామని, ఈ డబ్బులు వాళ్ల వద్దకు చేరాయని విచారణలో నిందితులు పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
కాలేశ్వరం ప్రాజెక్టు అవకతవకల కేసులో అరెస్టు అయి చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఇంజినీరింగ్ చీఫ్ ఈఎన్సీ హరి రామ్ను ఏసీబీ అధికారులు శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. అతనిని ఐదు రోజుల పాటు విచారించనున్నారు.
ఏసీబీ అధికారులు హరీ రామ్ను అరెస్ట్ చేసి రీమాండ్కు తరలించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఆయన వ్యవహారించారు. హరీ రామ్ను అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించాలని భావిస్తున్నారు. ఈ మేరకు సోమవారం కోర్టులో కస్టడీ పిటీషన్ దాఖలు చేయనున్నారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పంజాగుట్ట పోలీసులు యాంకర్ శ్యామలను 4 గంటలు విచారించారు. ఇప్పటికే ఆమె హైకోర్టు ద్వారా అరెస్టు నుంచి రక్షణ పొందగా.. పోలీసులు నోటీసులు జారీ చేయడం తో సోమవారం ఉదయం తన న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు.
రాజాభయ్యా చాలాకాలంగా తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, ఇప్పుడు తన ప్రాణాలకు ముప్పు ఉందనే భయాలున్నాయని తన ఫిర్యాదులో భన్విసింగ్ పేర్కొన్నారు. అత్తమామలు సైతం తనను వేధిస్తున్నారని చెప్పారు.
లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ ముందస్తు షెడ్యూల్ ప్రకారం విదేశీ ప్రతినిధులతో సమావేశం కావాల్సి ఉందని, ఆ కారణంగా విచారణకు హాజరుకాలేరని కోర్టుకు విన్నవించారు. అయితే, కోర్టు ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్ నాయక్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకాలేదు. రఘురామను అరెస్టు చేసి సీఐడీ ఆఫీస్కు తీసుకొచ్చిన సమయంలో సునీల్ నాయక్ అక్కడకు వచ్చారని ధృవీకరించారు. ఇప్పటికే నమోదు చేసిన వాంగ్మూలం ఆధారంగా ఆయన పాత్రపైనా విచారించేందుకు రావాలని కోరినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
ప్రకాశం జిల్లా : నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సీఐడీ డీఐజీ గా పనిచేసిన సునీల్ నాయక్కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం విచారించనున్నారు. ఈ రోజు విచారణకు రావాలని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆయనకు నోటీసు ఇచ్చారు.