Home » Case
ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, అత్యధికంగా కేరళలో 1,679 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత స్థానంలో గుజరాత్ (615), పశ్చిమబెంగాల్ (596), ఢిల్లీ (592) ఉన్నాయి. గత 24 గంటల్లో కేరళలో ఇద్దరు మరణించగా.. కర్ణాటక, పంజాబ్లలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద 11 మందిని బలిగొన్న తొక్కిసలాట ఘటనలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్లపై కేసు నమోదైంది.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు గత 14 నెలలుగా ప్రభాకర్ రావు అమెరికాలోనే తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు ఆయన ఇండియాకు వస్తున్నారు. దీంతో సిట్ అధికారులు ఆయనను విచారించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మ్యాచ్ఫిక్సింగ్ జరిగిందని ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడైన నందకుమార్ తెలిపారు. విచారణకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు వచ్చినా ఒరిగేదేమి ఉండదని స్పష్టం చేశారు.
Sharmistha Panoli Wajahat Khan: న్యాయ విద్యార్థిని, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ శర్మిష్ఠ పనోలిపై కేసు దాఖలు చేసిన వజాహత్ ఖాన్ పరారీలో ఉన్నాడు. కోల్కతాకు చెందిన వజాహత్ ఓ మతానికి చెందిన దేవతలు, ఆచారాలపై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారనే ఆరోపణలతో పలు రాష్ట్రాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎ్సఐబీ) మాజీ చీఫ్(ఓఎస్డీ) ప్రభాకర్రావు మూడ్రోజుల్లో భారత్ రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
APPSC Group1 Case: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం కుంభకోణం కేసులో విచారణ జరుపుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు, పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మధును విచారించగా క్యామ్సైన్ సంస్థ ఉద్యోగి రఘు పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన శ్రవణ్రావును ప్రిజనర్స్ ట్రాన్సిట్(పీటీ) వారెంట్పై కస్టడీలోకి తీసుకోవడానికి సిట్ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.
Phone Tapping Case: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు ప్రొక్లెయిమ్డ్ అఫెండర్(ప్రకటిత నేరస్థుడు) నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో అతనిపై జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు అమలు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం ప్రారంభించింది.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ వ్యవహారంలో తల్లీ తనయులిద్దరూ రూ.142 కోట్లు లబ్ధి పొందారని బుధవారం నాడు ఢిల్లీ ప్రత్యేక కోర్టులో వాదనలు వినిపించింది.