Home » Case
తెలంగాణలో సంచలనం సృష్టించిన బాలిక వసంత హత్య కేసులో తాజాగా షాకింగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. ఆమె తండ్రే ప్రధాన సూత్రధారి అని పోలీసుల విచారణలో..
పలు పబ్లలో డిస్క్ జాకీ (డీజే)గా పనిచేస్తున్న వ్యక్తితో పాటు అతడితో టచ్లో ఉన్న ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్) డైరెక్టర్ సందీప్ శాండిల్య సోమవారం ఈ వివరాలను వెల్లడించారు.
పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు యడియూరప్పపై బెంగళూరు కోర్టు నాన్బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ పోలీసులు ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. సాయం కోసం కుమార్తె(17)తో కలిసి తాను ఈఏడాది ఫిబ్రవరి 2న యడియూరప్ప ఇంటికి వెళ్లగా తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో సదాశివనగర్ పోలీసులు మార్చి 14న ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు.
భోజనం చేశాక తీరిగ్గా కూర్చుని చల్లటి ఐస్క్రీమ్ను ఆస్వాదిస్తున్న ఆయన నాలుకకు ఏదో గట్టిగా తగిలింది! అది పళ్ల కింద నలగలేదు.. అంటే డ్రైఫ్రూట్ కాదు. అనుమానమొచ్చి చేత్తో బయటకు తీసి చూసి కంగుతిన్నాడు! అది.. మనిషి చేతి వేలు! ముంబైలోని పశ్చిమ మలాద్ ప్రాంతంలోని ఓర్లెమ్ బెండన్ సెర్రావో అనే 26 ఏళ్ల వైద్యుడికి ఇలా ఒళ్లు గగుర్పొడిచే జుగుప్సాకరమైన, భయానక అనుభవం ఎదురైంది.
గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన రూ.700 కోట్ల కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న రాంచందర్ నాయక్, కల్యాణ్ల 3 రోజుల ఏసీబీ కస్టడీ బుధవారం ముగిసింది. చంచల్గూడ జైల్లో ఉన్న నిందితులను ఉదయం కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు తరలించారు.
గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల కుంభకోణం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టై జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న తెలంగాణ స్టేట్ లైవ్స్టాక్ డెవల్పమెంట్ ఏజెన్సీ మాజీ సీఈవో రాంచందర్తోపాటు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ జి.కల్యాణ్ కుమార్ను ఏసీబీ అధికారులు మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు.
రాష్ట్రం నుంచి కొత్తగా ఎన్నికైన 17 మంది ఎంపీల్లో 14 మంది(82ు)పై కేసులున్నాయని ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎ్ఫజీజీ)’ తెలిపింది. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్పై అత్యధికంగా 54 కేసులున్నాయని వెల్లడించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ (ఓఎస్డీ) పొట్లపల్లి రాధాకిషన్రావుకు నాంపల్లి కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. తన తల్లి సరోజినీ దేవి (98) సోమవారం మృతిచెందడంతో ఆమె అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతించాలని రాధాకిషన్రావు సోమవారం కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
ఎన్నికల ప్రచారంలో పిల్లలను వాడుకోవద్దన్న నిబంధనను ఉల్లంఘించిన కేసులో కేంద్రమంత్రులు అమిత్షా, కిషన్రెడ్డి పేర్లను తొలగించేందుకు ప్రయత్నించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ను టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ కోరారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు చేసిన అరాచకాలకు అంతూపంతూ లేకుండా పోతోంది. తవ్వేకొద్దే వారి అఘాయిత్యాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పిన్నెల్లి, తాడిపత్రి, తిరుపతి ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా... గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ కూటమి నేతలపై దాడులు చేయడం, దీన్ని సమర్థవంతంగా తెదేపా శ్రేణులు తిప్పికొట్టిన సంగతీ తెలిసిందే. సర్వేపల్లి నియోజకవర్గంలోనూ ఇలాంటి ఘటనలే వెలుగులోకి వచ్చాయి.