Home » BRS
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కక్షసాధింపు చర్యలకు వెళుతూ అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని శాసనమండలి సభ్యుడు దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో అన్నివర్గాలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం.. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ గెలుపును ఆపలేరని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆమె సూచించారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు ఐటీ శాఖ అధికారులు ఝలక్ ఇచ్చారు. ఆయన కుమార్తె పేరు మీద ఉన్న కోట్లాది రూపాయిల ఆస్తులను అటాచ్ చేశారు.
తెలంగాణలో రానున్న మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ఎన్నికలపై సీరియస్గా దృష్టి సారించిన పార్టీ, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఉమ్మడి జిల్లాల వారీగా వరుసగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీని సంస్థాగతంగాా బలోపేతం చేయడం, స్థానిక సమస్యలు, ఎన్నికల వ్యూహాలపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది..
మాజీ సీఎం కేసీఆర్ను మంత్రి సీతక్క కలవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో కేసీఆర్ను మంత్రి కలిసి మేడారం జాతరకు ఆహ్వానించనున్నారు.
స్థానికులెవరూ అధైర్య పడొద్దు అండగా ఉంటానని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్లోని దాసారం బస్తీలో గుడిసెవాసులను ఖాళీ చేయాలని కొంతమంది భయబ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికులు తలసానికి విన్నవించారు.
ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయాలో పీక్స్కు చేరాయి. ఒకవైపు కేటీఆర్ టూర్ మరోవైపు మంత్రి తుమ్మల కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ తో కార్పొరేటర్ల జంపింగులు ముందస్తు ఎన్నికల వ్యూహాలతో ఖమ్మం రాజకీయం హీటెక్కిపోతోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అంతేకాదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావుకు కూడా నోటీసులు ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ నడుస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ గౌరవ సభ కాదని.. కౌరవ సభ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాసనసభ బూతుల సభగా మారిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి శ్రీనినాస్గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రజలు వలసలు పోయింది గత కాంగ్రెస్ పాలనలోనేనని ఆరోపణలు చేశారు.