Home » Botsa Satyanarayana
టీచర్ల బదిలీలపై మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ(Botsa Satyanarayana) స్పందించారు. రాష్ట్రంలో టీచర్ల అక్రమ బదిలీలు(Teachers Transfers News) జరిగాయని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి వీలుగా బదిలీలు నిలిపివేయాలని అధికారులకు తానే విజ్ఞప్తి చేశానని బొత్సా సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ(Education Department of Andhra Pradesh) పరిధిలో గతంలో..
ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత.. ఓడిపోయిన ఆ పార్టీ అభ్యర్థులు ఒక్కొక్కరు మీడియా ముందుకు వస్తున్నారు. తాజాగా మాజీమంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ ఓటమిపై స్పందించారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని తెలిపారు.
మంత్రి బొత్స సత్యనారాయణపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. పచ్చకామెర్ల వారికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందని అన్నారు. అవినీతి చేసే వారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తుందని పురందేశ్వరి ఫైర్ అయ్యారు. బొత్స చేసిన వోక్స్ వాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు.
Andhrapradesh: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద పవన్ కళ్యాణ్ అవగాహనలేకుండా.. ఊగుతూ మాట్లాడం ఏమిటి? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మాటలను ఎందుకు పట్టించుకోవాలన్నారు. ఆయన మాట్లాడే భాష ప్రజాస్వామ్యబద్ధంగా ఉందా? ఇటువంటి వ్యాఖ్యలను ఎవరైనా హర్షిస్తారా అని మండిపడ్డారు. ఆయన భాష ఏంటి, ఆయన హావభావాలు ఏంటని అడిగారు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan) ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోపై మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. పేద వాడి జీవన ప్రమాణాలకు అనుగుణంగా తమ మేనిఫెస్టో ఉందని అన్నారు.
Andhrapradesh: ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలో రాబోయే ప్రభుత్వంపై మంత్రి బొత్ససత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ మీద ఆధార పడే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నామని మంత్రి బొత్స కామెంట్స్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తాము ఎపుడూ బీజేపీతో చెట్టా పట్టాలేసుకుని తిరగలేదన్నారు. రాష్ట్ర ప్రయోజన కోసం మాత్రమే బిల్లుల విషయంలో సమర్ధించామన్నారు.
Andhrapradesh: మంత్రి బొత్స సత్యనారాయణపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బొత్స.. జగన్కు తండ్రి సమానులు అంటూ ఓ వార్తను ఈరోజు ఉదయం పేపర్లో చూశానని.. ఇదే బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో వైఎస్సార్ను తిట్టిపోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రేపల్లె నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల మాట్లాడుతూ...
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మాట ఇస్తే... మాట తప్పరు, మడమ తిప్పరని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖను పరిపాలన రాజధాని చేస్తానని సీఎం జగన్ అన్నారని.. మళ్ళీ గెలిచిన తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ చెప్పారని తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహించామని.. పెట్టుబడులు వచ్చాయన్నారు.
Andhrapradesh: సీఎం జగన్ ప్రభుత్వం అవసరం, ఆవశ్యకత ఈ రాష్ట్ర ప్రజలకు ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పెట్టిన వ్యవస్థలు దేశంలో ఎక్కడా లేవన్నారు. జగన్ అమల చేసిన సంస్కరణల వలన రాష్ట్రంలో పేదరికం తగ్గిందని తెలిపారు. విద్యలో కూడా కేరళను అధిగమించామని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ చెప్పిందే చేశారని... చేయలేనివి చెప్పరని అన్నారు.
సొంత ఇలాకా చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక నేతలు వైసీపీని వీడారు. మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కోట్ల కుటుంబం, మాజీ ఎంపీపీ మోతిలాల్ నాయుడు కూడా పార్టీ మారారు.