Home » BJP
వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, కూటమిలో కొత్త పార్టీల చేరిక తదితర అంశాలపై మంగళవారం జరిగిన బీజేపీ చింతనా సమావేశంలో పార్టీ నేతలు సమీక్ష జరిపారు. మహాబలిపురం సమీపంలోని ఓ హాలులో ఏర్పాటైన ఈ సమావేశానికి బీజేపీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పీఎల్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై కుట్ర జరుగుతోందంటూ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై కేంద్రమంత్రి నడ్డా ప్రశంసలు కురిపించారు. ఎన్డీయే పాలనను బాధ్యత కలిగిన, స్పందించే పాలనగా అభివర్ణించారు. గత 11 ఏళ్ల మోదీ నాయకత్వంలో సమర్ధవంతమైన పనితీరుతోపాటు జవాబుదారీ ప్రభుత్వాన్ని అందించామని చెప్పారు.
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే నాయకులు, కార్యకర్తలను నియోజకవర్గంలో మోహరించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ శాసనసభ స్థానం ఖాళీ అయింది.
బీఆర్ఎస్నుంచి కాంగ్రెస్లో చేరి ప్రస్తుతం అభివృద్ధి కోసమే తాను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశానని, పార్టీ మారలేద ని, బీఆర్ఎ్సలోనే ఉన్నానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్గౌడ్ మాట్లాడటం సిగ్గు చేటని బీజేపీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి, కార్పొరేటర్ తోకల శ్రీనివాస్రెడ్డి అన్నారు.
ఈ పరిణామంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి తల్లిని కాంగ్రెస్ అవమానపరచడం గర్హనీయమని అన్నారు. ప్రధాని తల్లి అందరికీ తల్లి అని, ఆమెను అవమానపరిచిన కాంగ్రెస్కు బిహార్ ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని అన్నారు.
అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ఎలాంటి విభేదాలు లేకుండా పటిష్ఠంగా ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పయనిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ మరోమారు స్పష్టంచేశారు.
తన బిడ్ట ఇంకా రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదని షర్మిల స్పష్టం చేశారు. తన కొడుకు రాజకీయ ప్రవేశంపై వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుందంటే వారికి భయమా, బెదురా? అని ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం రాహుల్ గాంధీకి అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ (ASL)తో Z+ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నట్లు CRPF అధికారి తెలిపారు. Z+ ASL అనేది ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్న వ్యక్తులకు అందించే అత్యున్నత స్థాయి రక్షణల్లో ఒకటిగా పేర్కొన్నారు.
తాము అధికారంలోకి వస్తే డీఎంకే ప్రభుత్వం నిలిపేసిన పథకాలను మళ్లీ ప్రారంభిస్తామని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. కోవై జిల్లా పొల్లాచ్చి అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం ఉదయం ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో కుల సంఘాల ప్రతినిధులు, రైతులు, నేత కార్మికులు, పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు.