Home » Bhupathiraju Srinivasa Varma
కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ(Bhupathiraju Srinivasa Varma) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ మర్యాదలతో కేంద్రమంత్రికి అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం శ్రీనివాసవర్మ మీడియాతో మాట్లాడారు.
లోక్ సభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఏపీ బీజేపీ అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉపాధి, నైపుణ్య శిక్షణ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పేద, మధ్య తరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు.
జగన్ సర్కార్ అనాలోచిత నిర్ణయాల వల్ల ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. వైసీపీ హయాంలో భారీగా కేంద్రం ఇచ్చిన నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆయన ఆరోపించారు. విశాఖలో పర్యటించిన కేంద్ర మంత్రి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరణ మంత్రుల పరిధిలో ఉండే అంశం కాదని ఉక్కుశాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ (Srinivasa Varma) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ(Minister Bhupathiraju Srinivas Verma) తెలిపారు.
రాజకీయాలు కొత్త ఏం కాదని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ (Bhupathiraju Srinivasa Varma) అన్నారు. కష్టపడ్డ సామాన్య కార్యకర్తకు బీజేపీ గుర్తింపు ఇస్తుంది అనేదానికి తాను ఉదాహరణ అని చెప్పారు. పొత్తుల చర్చల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తకు ఇచ్చే భరోసా ఏంటి అని ప్రశ్నించామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో నూతన పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని భరోసానిచ్చారు.
నరసాపురం బీజేపీ ఎంపీ, భూపతిరాజు శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా తన ఛాంబర్లో సంతకం చేసి బాధ్యతలు తీసుకున్నారు.
బీజేపీలో సామాన్య కార్యకర్త స్థాయిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన భూపతిరాజు శ్రీనివాస వర్మ నరసాపురం లోక్సభ స్థానం నుంచి విజయం సాధించడమే అనూహ్యం. అంతే అనూహ్యంగా ఆయనకు కేంద్రమంత్రిగా కూడా అవకాశం దక్కింది. 1967 ఆగస్టు 4న జన్మించిన ఆయనకు.. రొయ్య సాగు, వాణిజ్యంలో 20 ఏళ్లు, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉంది. 1991 నుంచి 95 వరకు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా, 1995 నుంచి 97 వరకు పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి164 సీట్లతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఏపీ నుంచి బీజేపీ తరఫున నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు (Bhupathiraju Srinivasa Varma) మోదీ3.0 కేబినేట్లో అవకాశం వరించింది. ఈ మేరకు పీఎంవో నుంచి ఆయనకు సమాచారం వచ్చింది.