Home » Bhupalpalle
జయశంకర్-భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి హత్య కేసు రోజుకో మలుపు తిరుగింది. చివరికి పోలీసులు హత్య కేసు మిష్టరీని చేధించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు మీడియా సమావేశంలో ఎస్పీ కిరణ్ ఖరె హత్య కేసు వివరాలను వెల్లడించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన జయశంకర్-భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి హత్య కేసులో చిక్కుముడి వీడడం లేదు.
ఆ శిశువులు కవలలు.. వయసు నాలుగు నెలలే! బిడ్డలకు ఆ తల్లి పొద్దున, రెండు గంటల తేడాతో రెండుసార్లు పౌడరు పాలు తాగించి పడుకోబెట్టింది. కొద్దిసేపటికి శిశువుల ముక్కుల్లోంచి పాలు రావడం.. పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు బిడ్డలను ఆస్పత్రికి తీసుకెళ్లారు.
సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య పథకం ప్రకారమే జరిగిందని, భూపాలపల్లి పట్టణంలో ఓ భూవివాదమే హత్యకు దారి తీసిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.
తీవ్ర సంచలనం సృష్టించిన భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి (52) హత్య.. రాజకీయ దుమారం రేపుతోంది. ఈ హత్య వెనుక బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ కుటుంబం హస్తం ఉందంటూ మృతుడి భార్య సరళ ఆరోపించడంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణహత్య జరిగింది. ప్రజావేగు, సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తిని బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. ఆయన హత్యకు కారణాలు తెలియరాలేదు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని ప్రాచీన పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కావడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోగా, ప్రేమ పెళ్లి వాయిదా పడటంతో మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడిన రెండు వేర్వేరు ఘటనలు భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకున్నాయి.
కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ) కోసం భూములు ఇచ్చి రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న ఆ కుటుంబాలు మాత్రం చీకట్లలో మగ్గుతున్నాయి. భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికీ ఉద్యోగం ఇస్తామన్న కేటీపీపీ... తన హామీని తుంగలో తొక్కడంతో నిర్వాసితులు 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నారు.
తెలంగాణలో మరో నీటిపారుదల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సాయం అందనుంది. జయశంకర్-భూపాలపల్లి జిల్లాలో చిన్నకాళేశ్వరం(ముక్తేశ్వర్) ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం పచ్చజెండా ఊపింది.